పోలీసుల అదుపులోకి ప్రణీత్‌రావు.. రహస్య ప్రదేశంలో విచారణ!

గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 11 Mar 2024 22:32 IST

హైదరాబాద్‌: గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావుతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్‌ ఆదివారం పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు