Road Accident: కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబొత్తుల నవీన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు 8 మందితో ఆటోలో యానాం వెళ్లారు. వేడుకల అనంతరం పాశర్లపూడికి తిరిగి వస్తుండగా చేపల లోడుతో వస్తున్న లారీ, వీరి వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కోనసీమ జిల్లా నగరం గ్రామానికి చెందిన సాపే నవీన్, కొల్లాబత్తుల జతిన్, పి.గన్నవరం మండలానికి చెందిన వల్లూరి అజయ్, మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన నల్లి నవీన్ కుమార్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!