Road Accident: ఆటో - లారీ ఢీ: ఐదుగురి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

Updated : 03 Sep 2023 11:23 IST

సంతమాగులూరు, అనంతపురం: ఏపీలో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆటో - లారీ ఢీకొని ఐదుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

గుడివాడ వైకాపాలో ముసలం

బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు మహిళలు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారు గుంటూరుకు చెందిన క్యాటరింగ్‌ సిబ్బందిగా స్థానికులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. విడపనకల్లు మండలం పొలికి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను బాలు(18), వర్ధన్‌(20)గా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని