ఘోరం.. బస్సుపై తెగిపడిన కరెంటు తీగ.. ప్రయాణికుల సజీవదహనం
Bus Accident: హైటెన్షన్ వైరు పడటంతో బస్సుకు నిప్పంటుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు.
గాజీపుర్: ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజీపుర్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్ కరెంట్ వైరు (High Tension Wire) తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా కాలిన గాయాలపాలైన మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్