Crime news: జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
కడప నేరవార్తలు: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గొర్ల పుల్లయ్యగారి వీధికి చెందిన ఉమామహేశ్వరి, శ్రీహరికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు(17), కుమార్తె(16) ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదే ప్రాంతంలో భర్తకు దూరంగా నివాసం ఉంటోంది. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు కేసులతో పాటు భర్తకు దూరమయ్యాననే బాధతో ఆమెకు జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. భర్త శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!