Sangareddy: వాగులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ముగ్గురి మృతి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
సదాశివపేట: స్టీరింగ్ రాడ్డు విరగడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సదాశివపేట మండలం కొల్కూరు గ్రామానికి చెందిన మంగలి గోపాల్(30), ఈటల రమణ(45), ఎంపల్లి మల్లేశ్(30) ట్రాక్టరుపై కొల్కూరు వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ స్టీరింగ్ విరిగింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కొల్కూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను శవపరీక్ష కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం