Bhongir: సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఇద్దరు విద్యార్థినుల మృతి

జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 03 Feb 2024 22:25 IST

భువనగిరి: జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి  భోజనం చేసిన తర్వాత హాస్టల్‌ గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నారు. గమనించిన తోటి విద్యార్థినులు సమాచారం ఇవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య, వైష్ణవి అని పోలీసులు తెలిపారు. ఘటనపై జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి విచారణ జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని