విద్యార్థులు కాలినడకన.. ప్రయాణికులు ఆటోల్లో..
జిల్లాలోని 59 గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనుకూలంగా ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యంలేదు. దీంతో విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ, సైకిళ్లు, ఆటోలపై పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
బస్సు సౌకర్యంలేక ఇబ్బందులు
భూపాలపల్లి మండలం దూదేకులపల్లి, పందిపంపులకు బస్సు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి వెళ్తున్నారు. గొల్లబుద్దారం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిందే.
భూపాలపల్లి నుంచి కాటారం మండలం రుద్రారంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ వరకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని డిపో ముందు కొన్నేళ్లుగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. బస్సు లేకపోవడంతో భూపాలపల్లి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటెక్నిక్కు విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు బొగ్గు, ఇసుక రవాణా లారీలపైనే ప్రయాణిస్తున్నారు.
మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన విద్యార్థులు మొట్లపల్లి గ్రామంలోని హైస్కూల్కు నిత్యం సైకిళ్లపై వెళ్తున్నారు.
న్యూస్టుడే, భూపాలపల్లి
జిల్లాలోని 59 గ్రామాలకు రోడ్డు సౌకర్యం అనుకూలంగా ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యంలేదు. దీంతో విద్యార్థులు నిత్యం నడుచుకుంటూ, సైకిళ్లు, ఆటోలపై పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వివిధ అవసరాల నిమిత్తం వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘న్యూస్టుడే’ బృందం సోమవారం పరిశీలించింది.
బస్సు సర్వీసు రద్దయిన గ్రామాలు
* భూపాలపల్లి మండలం కాశీంపల్లికి గతంలో పరకాల డిపోకు చెందిన రెండు బస్సులు నడిచేవి. ఇందులో ఒక ఎక్స్ప్రెస్ కాశీంపల్లి నుంచి హైదరాబాద్కు, మరొకటి పరకాల వరకు నడిచేవి. వీటిని కాశీంపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, జంగేడు, వేశాలపల్లి ప్రజలు వినియోగించుకునేవారు. పదేళ్ల నుంచి బస్సులు రద్దు కావటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు.
* పెద్దపల్లి జిల్లా మంథని డిపో నుంచి ఉదయం, సాయంత్రం కాటారం, భూపాలపల్లి మీదుగా మల్హర్ మండలం నాచారం, అనుసాన్పల్లి నుంచి భూపాలపల్లి మండలం గొర్లవీడు వరకు బస్సు సౌకర్యం కల్పించారు. జయశంకర్ జిల్లాలో మల్హర్ విలీనం కావటంతో రద్దు చేశారు.
* రేగొండ మండలంలోని జూబ్లినగర్, దమ్మన్నపేట, రాయపల్లి, కనిపర్తి గ్రామాలకు గతంలో బస్సు సౌకర్యం ఉంది. గతేడాది నుంచి రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు.
* మహదేవపూర్ మండలంలోని ఎన్కపల్లి, రాపెల్లికోట, కిష్టరావుపేట గ్రామాల నుంచి విద్యార్థులు సూరారం ప్రభుత్వ పాఠశాల, మహదేవపూర్లోని జూనియర్, డిగ్రీ కళాశాలకు వెళ్లడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
* బస్సు సౌకర్యం లేకపోవడంతో మహాముత్తారం మండలంలోని దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల నుంచి కొర్లకుంట, కాటారం మండలం చింతకాని, పోతులువాయి విద్యార్థులు ఇంటికి చేరాలంటే రాత్రి 8గంటలు అవుతుంది.
203 నిర్ధారణ పరీక్షలు
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం చేసిన నిర్ధారణ పరీక్షలలో ఎవరికి పాజిటివ్ రాలేదని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వెయ్యి పైగా జనాభా, రోడ్డు ఉన్నా బస్సు సౌకర్యం లేని గ్రామాల సంఖ్య
భూపాలపల్లి 4
మహదేవపూర్ 5
గణపురం 4
పలిమెల 3
చిట్యాల 8
టేకుమట్ల 5
మహాముత్తారం 5
మొగుళ్లపల్లి 4
రేగొండ 12
కాటారం 5
మల్హర్ 4
ట్వీట్ చేస్తే చాలు
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతి గురువారం ‘బస్ డే’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఊరికి బస్సు సౌకర్యం కావాలనుకునేవారు, వివాహాలు, విహార యాత్రలు, రైతుల ధాన్యం తరలింపు ఏ అవసరానికైనా/R@tsrtcmdoffice ట్వీటర్ ఖాతాకు ట్వీట్ చేస్తే చాలు. మీ వద్దకే బస్సు వస్తుంది.
డిపో పరిధిలో నిత్యం 38 రూట్లలో బస్సులు 34,900 కిలోమీటర్ల వరకు తిప్పుతున్నారు. సగటున్న రోజువారీ ఆదాయం రూ.11 లక్షల వరకు ఉంటుంది.
మొతం బస్సులు - 76
సంస్థ - 52
అద్దె - 24
ఎక్స్ప్రెస్ - 17
డీలక్స్ - 01
హైటెక్ - 11
పల్లెవెలుగు-23
సిబ్బంది - 340
వీసీ సజ్జనార్ గారూ.. మీరు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీ సర్వీసుల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులు, ప్రజల ఇబ్బందులు తీరుస్తున్నారు. మా జిల్లాలో కూడా బస్సులు లేని గ్రామాలకు నూతన సర్వీసులను కల్పించి మా బాధలు తీర్చాలని కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనాటిదో ఓరుగల్లు కల... నెరవేరదేమి!
[ 11-05-2024]
అవసరం ఉన్నా ఇక్కడికే వస్తారు.. అలాంటిది ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ - యూజీడీ) ప్రాజెక్టు నెరవేరడం లేదు. ప్రతి లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు నినాదంలా మారుతోంది. -
కమలాపూర్.. గులాబీమయం
[ 11-05-2024]
కమలాపూర్లో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం రాత్రి కూడలి సమావేశంలో ప్రసంగించారు. సిరిసిల్లలో కేసీఆర్ రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం కమలాపూర్లోని బస్టాండు కూడలికి రాత్రి 9.18 గంటలకు చేరుకున్నారు. అప్పటికే హుజూరాబాద్ నియోజవకర్గంలోని వివిధ మండలాల నుంచి భారీగా ప్రజలను భారాస శ్రేణులు తరలించాయి. -
నగర ఓటరుకు ఏమైంది?
[ 11-05-2024]
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది వరంగల్ మహానగరం పరిధిలో ఉండే వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనే. -
తల్లి దర్శనం.. ఇంత కష్టమా!
[ 11-05-2024]
అక్షయ తృతీయ పర్వదినం, భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు, శుక్రవారం శుభదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దేవాలయం బయట, గర్భాలయం ముందు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
[ 11-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి
[ 11-05-2024]
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాలుగు నెలలుగా జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, సింగరేణి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షు బాలసాని రాజన్నలు డిమాండ్ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహణ
[ 11-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసినందున శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన సేవల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. -
చెరువుల్లో మట్టి దందా!
[ 11-05-2024]
భూగర్భ జలాలు అడుగంటడంతో.. చెరువుల్లో విధ్వంసకాండ యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల కుమ్మక్కుతో అక్రమ దందా నాలుగు యంత్రాలు.. ఎనభై ట్రాక్టర్లుగా విరాజిళ్లుతోంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ నల్లమట్టి తరలింపునకు ఎదురులేకుండా పోయింది. -
ప్రశాంత ఎన్నికలకు భారీ భద్రత
[ 11-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో ఎన్నికల నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర. కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. -
ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సార్లు!
[ 11-05-2024]
దేశంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల ఏర్పాటు.. రద్దులాంటి కీలక పరిణామాలు జరిగాయి. -
భద్రత కట్టుదిట్టం..
[ 11-05-2024]
మే 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కూడలి సమావేశంలో కడియం కావ్య, నాగరాజు ప్రసంగించారు. -
జిల్లా జనరల్ ఆసుపత్రి ఓపీ సేవలకు క్యూఆర్ కోడ్
[ 11-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు పొందేందుకు పేరు నమోదు చేసుకోవడానికి ఇక నుంచి క్యూఆర్కోడ్ స్కాన్ ఉపయోగించవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. -
ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి
[ 11-05-2024]
-
ఓటుకు పోటెత్తాలి..!
[ 11-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఎంతో కీలకమైనది ఓటు.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ, నేటితరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. -
ఇళ్ల కేటాయింపులో కాలయాపన ఎందుకో..?
[ 11-05-2024]
భారాస హయాంలో జిల్లా కేంద్రంలో వెయ్యి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాం.. ఇందులో 540 ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేశాం.. మిగతా 460 ఇళ్లను ఆరు నెలలుగా పేదలకు కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
‘సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మొద్దు’
[ 11-05-2024]
దొంగ హామీలు, మాయమాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. -
ప్రజల రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్లో చేరా..
[ 11-05-2024]
నా పనితీరును గుర్తించి ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. వారి రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్లో చేరానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా శుక్రవారం రాత్రి జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు, జఫర్గఢ్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. -
భాజపాతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
స్వల్పం.. ఆధిక్యం..
[ 11-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. ఈ స్థానంలో ఇప్పటి వరకు 17 సార్వత్రిక, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. -
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
[ 11-05-2024]
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత.. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చక పోతే తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని సైతం ఎన్నికల సంఘం కల్పించింది. -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 11-05-2024]
తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం జరిగింది. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 11-05-2024]
గంజాయి కేసులో ఇద్దరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!