నిధులు రాక.. నిర్వహణ లేక
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి.
మూసివేత దశలో ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలు
జంబుగా ఉద్యానవన కేంద్రం
న్యూస్టుడే, కాగజ్నగర్గ్రామీణం : రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. కాగజ్నగర్, ఆసిఫాబాద్లలోని ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాల్లో పెంచిన పండ్ల మొక్కల విక్రయం, తోటలతో రూ.లక్షల ఆదాయం వచ్చినా అందులో తోటల అభివృద్ధికి నయా పైసా కేటాయించకపోవడంతో అందాల తోటలకు చీకటి రోజులు వచ్చాయి. ఈ కేంద్రాలపై ఆధారపడిన కూలీలను సైతం తొలగించడంతో నిర్వహణ లేకుండా పోయింది.
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని జంబుగా, ఆసిఫాభాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 1989 సంవత్సరంలో ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జంబుగాలో 86 ఎకరాల్లో, ఆసిఫాబాద్ కేంద్రంలో 27 ఎకరాల్లో మామిడి, నిమ్మ, సపోటా తోటలను పెంచారు. హైబ్రీడ్ బంగన్పల్లి, దసేరి మామిడి మొక్కలు అంటుకట్టు విధానంలో ఉత్పత్తి జరిగేది. అప్పట్లో జంబుగాలో 25 నుంచి 30 మంది కూలీలు, ఆసిఫాబాద్లో 10 నుంచి 15 మంది కూలీలు పనిచేసే వారు. వివిధ రాయితీ పథకాల ద్వారా మామిడి తోటల పెంపకం చేపట్టే రైతులకు ఈ కేంద్రాల్లో పెంచిన మామిడి మొక్కలను అందించేవారు. ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు మొక్కలు సరఫరా చేసిన చరిత్ర ఈ కేంద్రాలది. వీటి నిర్వహణకు పదేళ్లుగా నయాపైసా కేటాయించకపోవడంతో అధ్వానస్థితికి చేరుకున్నాయి.
ఎదుగుదల లేని జామ మొక్కలు
గతంలో రూ.20 లక్షల వరకు ఆదాయం
జిల్లాలోని ఈ రెండు కేంద్రాల్లో మొక్కలు, తోటలకు నీటితడులు అందించడానికి, కలుపు మొక్కలు తొలగించడానికి కూలీలు లేనందున రోజురోజుకూ అధ్వాన స్థితికి చేరుకున్నాయి. నీటితడులు లేక పూత, కాత లేకుండా పోయింది. గతంలో మామిడి మొక్కల విక్రయం, నిమ్మ, మామిడి, సపోట పండ్ల విక్రయంతో ఏడాదికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఉద్యానవన, నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాల నిర్వహణకు నయాపైసా కేటాయించడం లేదు. దీంతో ఈ కేంద్రాల్లోని పండ్ల తోటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్లతోటల పెంపకంపై రైతులను ప్రోత్సహించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను జిల్లాస్థాయి అధికారులు ఏ ఒక్కనాడు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం గమనార్హం. పాలకులు, అధికారులు స్పందించి ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలకు పూర్వ వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి చొరవ తీసుకోవాలి
జిల్లాలోని ఉద్యానవన నర్సరీలు, రైతు శిక్షణ కేంద్రాల అభివృద్ధికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనందున ఇవి మూసివేత దశకు చేరుకున్నాయి. ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి చొరవ తీసుకుని అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. నిధులు కేటాయించాలి. వీటికి పూర్వ వైభవం తీసుకు వచ్చినట్లయితే స్థానిక కూలీలకు ఉపాధి లభించడంతోపాటు సర్కారుకు ఆదాయం వస్తుంది.
ఠాకూర్ నాగేందర్, రైతు, గువ్వలగూడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలక ఘట్టం.. ఎవరికో పట్టం..
[ 12-05-2024]
దాదాపుగా రెండు నెలలుగా సాగిన రాజకీయ ప్రచారమంతా ఇప్పుడు ఓటర్ల చుట్టూ కేంద్రీకృతమవుతోంది. కీలక ఘట్టమైన పోలింగ్కు మరో 24 గంటలే మిగిలి ఉంది. -
పోలింగ్కు 1,500 మంది పోలీసులతో బందోబస్తు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
పార్టీలు వేరైనా పాతకాపులమేగా
[ 12-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం మండలంలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కరంజి-టిలో భారాస నాయకులు ఎదురుపడ్డారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
[ 12-05-2024]
అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ముగిసిన ఎన్నికల ప్రచారం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
నిబంధనల ఉల్లంఘన.. యథేచ్ఛగా విక్రయాలు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయ కేంద్రాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఆత్రం సుగుణను గెలిపించండి
[ 12-05-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: గోడం నగేష్
[ 12-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం పొన్నారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్జాదవ్ పేర్కొన్నారు. -
కదులుదాం..తరలుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, నేతలు ఎంతగా ప్రయాసపడ్డారో.. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ప్రజల నిర్ణయం ఎలా ఉందో నిక్షిప్తం చేసేది రేపు.. -
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
[ 12-05-2024]
ప్రేమ వ్యవహారం ఒక యువకుడిని బలిగొనగా, మరొకరు గాయపడేలా చేసింది. ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
మోదీ, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు: వివేక్
[ 12-05-2024]
ప్రధాని మోదీ, భారాస అధినేత కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో ప్రజాపాలన కొనసాగాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్..
[ 12-05-2024]
చెన్నూరు పట్టణంలో భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
రూ. వెయ్యి కోత.. ఎందుకీ తేడా?
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులకు భోజనం, ఇతర వసతుల కల్పన కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.4 వేలు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
[ 12-05-2024]
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజిద్ అలీ సస్పెండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
తాజా వార్తలు (Latest News)
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్