logo

భాజపా ఓడితేనే ఆదివాసుల మనుగడ

కేంద్రంలో భాజపా సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యమవుతుందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసం సచిన్ అన్నారు.

Updated : 28 Apr 2024 13:16 IST

ఎదులాపురం: కేంద్రంలో భాజపా సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యమవుతుందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసం సచిన్ అన్నారు. 'కేంద్ర ప్రభుత్వ గిరిజన విధానాలు ఆదివాసీల ప్రభావం' అనే అంశంపై సీఐటీయూ కార్యాలయంలో ఆదివాసి సంఘాలతో ఏర్పాటు చేసిన రౌండ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా లోక్‌సభ అభ్యర్థులను ఓడించాలని సూచించారు. ఆదివాసీలు పోరాటాలు చేసి సాధించుకున్న గిరిజన చట్టాలను భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీల అభివృద్ధికి విడుదల చేయాల్సిన నిధులను రద్దు చేసింది అని విమర్శించారు. ఆదివాసి రిజర్వేషన్లను సైతం రద్దు చేస్తామని ప్రకటించటం శోచనీయమన్నారు. ఇందుకుగాను ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని