కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది.
ఇంటర్ ఫలితాల్లో ఇదీ పరిస్థితి..
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే
ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. మొత్తంగా పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఏ ఒక్కటి కూడా 100 శాతం ఫలితాలు సాధించలేకపోయాయి. కారణమేదైనా తగ్గిన ఫలితాలు విద్యాశాఖ వర్గాలను కలవరపెడుతున్నాయి. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నేటినుంచి అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమంలో 1871 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 548 మంది ఉత్తీర్ణులై 29.28 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ద్వితీయ సంవత్సరంలో 1926 మందికి 905 మంది ఉత్తీర్ణత సాధించగా 46.98 శాతంతో కాస్త ఫర్వాలేదనిపించింది.
- జిల్లాలో కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమంలో 50.46, ద్వితీయంలో 80.67 శాతం ఉత్తీర్ణతతో రెండింటిలో మొదటి స్థానంలో నిలిచింది. దండేపల్లిలో ప్రథమంలో 109 మందికి 8 మంది మాత్రమే ఉత్తీర్ణతకాగా 7.34, ద్వితీయంలో చెన్నూరులో 165 మందికి 46 మంది పాస్కాగా 27.88 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
- కసూర్బాలు, తెలంగాణ ఆదర్శ కళాశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. 35 కళాశాలల్లో ప్రథమంలో 2416 మందికి 1453 మంది పాసై 67.70, ఇక ద్వితీయంలో 1944 మందికి 1606 మంది పాసై 82.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల కన్నా గురుకులాల్లో ప్రథమంలో 38.42 శాతం, ద్వితీయంలో 35.63 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం.
ప్రథమంలో.. మందమర్రి బాలికల బీసీ గురుకులం 89.57, బెల్లంపల్లి సీఓఈలో 94.59, మందమర్రి ఆదర్శ కళాశాలలో 86.99, మందమర్రి కేజీబీవీలో 97.44, మంచిర్యాల మైనార్టీ బాలికల గురుకులంలో 94.64 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ద్వితీయంలో.. బెల్లంపల్లి బీసీ గురుకులం 96.61, ఇందారం సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల 98.4, కాసిపేట ఆదర్శ కళాశాల 89.29, మందమర్రి కస్తూర్బాలో 93.55, బెల్లంపల్లి బాలికల మైనార్టీ గురుకులం 96.43 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
నేటి నుంచి ప్రత్యేక తరగతులు
ఇంటర్ వార్షిక ఫలితాల్లో జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో డీఐఈవో శైలజ జిల్లాలోని ఆయా కళాశాలల ప్రిన్సిపల్లతో సమావేశం నిర్వహించి తగ్గిన ఉత్తీర్ణత శాతంపై కారణాలు విశ్లేషించారు. మే నెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. గడువు తేదీలోగా ఫెయిల్ అయిన విద్యార్థులతో ఫీజులను కట్టించి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నెల 29 నుంచి మే 20 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులైన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతుల నిర్వహణతో పాటు, మోడల్ పేపర్లతో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నట్లు డీఐఈవో ఆర్.శైలజ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడిన వృద్ధులు
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. -
స్వల్ప ఘర్షణ లాఠీఛార్జ్
[ 13-05-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పుత్లీబౌలి పోలింగ్ బూత్ 264, 265 280 వద్ద పోలింగ్ సందర్భంగా స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. -
ఎన్నికల క్షేత్రం.. రక్షణ ఛత్రం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
శత శాతం ఓటు వినియోగం
[ 13-05-2024]
దేశంలో ఎన్నికల సమరం మొదలైన రోజుల్లో ఫలానా వారికి ఓటెయ్యాలని కరాఖండీగా చెప్పేవారు. -
ఉమ్మడి జిల్లాలో పోలీసుల అప్రమత్తం
[ 13-05-2024]
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. -
ఓట్ల పండగకు పోటెత్తుదాం!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఓట్ల పండగకు పోలింగ్ కేంద్రాలు ముస్తాబయ్యాయి. -
బాసరలో హైకోర్టు న్యాయమూర్తి
[ 13-05-2024]
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొన్నారు. ఆలయాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. -
ప్రశాంతతే లక్ష్యం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ మిగిలింది. -
ఎండైనా.. వానైనా.. గుబులే!
[ 13-05-2024]
రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం పోలింగ్ శాతంపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. మండే ఎండలకు ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ తగ్గడంతో ఈ ప్రభావం ఇక్కడ సైతం ఉంటుందనే భయం పట్టుకుంది. -
టెస్ట్ ఓటు!
[ 13-05-2024]
ఓటరు ఈవీఎం ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో బ్యాలెట్ యూనిట్లో తను కోరుకున్న అభ్యర్థికి/గుర్తుకు ఓటు వేస్తాడు. వీవీప్యాట్లో అదే అభ్యర్థికి చెందిన పేరు, గుర్తు కనిపించాలి. -
లోక్సభ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణి ..
[ 13-05-2024]
సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బూత్స్థాయిలో ఏజెంట్లు, ఇతర ముఖ్య కార్యకర్తలను కలిసి డబ్బులు ఇస్తుంటారు. -
144 సెక్షన్ అమలు ఇలా..
[ 13-05-2024]
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అనుకున్నప్పుడు పరిస్థితులు చేయిదాటకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తుంటారు. -
సర్వం సిద్ధం
[ 13-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
పోలింగ్ వేళ అప్రమత్తత అవసరం
[ 13-05-2024]
పోలింగ్ సందర్భంగా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌష్ ఆలం సిబ్బందికి సూచించారు. -
ఆర్టీసీ బస్సుల వివరాలు తెలుసుకోండి
[ 13-05-2024]
ఆర్టీసీ బస్సుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ చరవాణి నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ డిపో మేనేజరు కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. -
గ్రామస్థుల ఆందోళన
[ 13-05-2024]
గ్రామానికి దారి, త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పిస్తేనే ఓటు వేస్తామని ఇచ్చోడ మండలం బావోజీపేట్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. -
భారీ వర్షం.. అతలాకుతలం
[ 13-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’