ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..
ఈనాడు, ఆసిఫాబాద్
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. ముందు జాగ్రత్తగా కొందరిని బైండోవర్ చేశాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాం’ అని పోలీసులు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఎన్నికలను పురస్కరించుకుని అన్ని పల్లెలు, పట్టణాలు, ముఖ్య కూడళ్లలో మద్యం గొలుసు దుకాణాలు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతాల నుంచి మహిళలు, పిల్లలు వెళ్లడానికి జంకే పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే చూస్తామనే ఆబ్కారీ అధికారుల ధోరణితో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. లేనిపోని గొడవలు ఎందుకని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు అన్ని దుకాణాల్లో మద్యం విరివిరిగా లభిస్తోంది.
నెలవారీ వసూళ్లు..
చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు కొనసాగడానికి కారణం అధికారుల వసూళ్లే అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రతీ గొలుసు దుకాణం నుంచి స్థానిక పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు మామూళ్లు వెళుతున్నాయని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. లేదంటే ఈ స్థాయిలో గొలుసు దుకాణాలు కనిపించవనే అభిప్రాయాలను వీరు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 32 వైన్స్లు ఉండగా వందలాది గొలుసు దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది.
ఈ ప్రాంతాల్లో అధికం...
- కాగజ్నగర్ నుంచి ఈజ్గాం మీదుగా పెంచికల్పేట్ వరకు 30 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులను ఆనుకుని పల్లెల్లో అన్ని చోట్ల దుకాణాల్లో మద్యం లభిస్తోంది. ఈ మార్గంలో వందలాది గొలుసు దుకాణాలు ఉన్నాయి.
- చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దుకాణాల్లో మద్యం లభిస్తోంది.
- వాంకిడి మండలంలో కనర్గాం, ఇందాని మార్గంలో, ఆర్టీఏ చెక్పోస్ట్ సమీపంలో, ప్రయాణ ప్రాంగణాల ఎదుట ప్రధాన రహదారిపైనే గొలుసు దుకాణాలు ఉన్నాయి. వాహనదారులు సైతం మద్యం తాగి నడపడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
- జిల్లా కేంద్రంలోని బాలికల, బాలుర పాఠశాలలను ఆనుకుని మూడు మద్యం గొలుసు దుకాణాలు ఉండగా, మార్కెట్ దగ్గర, జన్కాపూర్ ఏరియాల్లో ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.
- ఆసిఫాబాద్-తిర్యాణి మార్గంలో 30 కిలోమీటర్లు దూరం ఉండగా దారిపొడవునా వెలిసిన దుకాణాల్లో మద్యం దొరుకుతోంది.
- జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి ఏజెన్సీ మండలాల్లోనూ గొలుసు దుకాణాలు విరివిరిగా ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు ఇది. ఈయన ఏకంగా మద్యం గొలుసు దుకాణానికి తన గదులను అద్దెకు ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో నిత్యం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం పది, పదకొండు గంటల వరకు ఈ దుకాణం తెరిచి ఉంటుంది. మళ్లీ సాయంత్రం నాలుగైదు గంటలకు తెరుస్తున్నారు. పోలీసే తమ ఇంటిని మద్యం గొలుసు దుకాణం కోసం అద్దెకు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎదురుగానే బాలుర ప్రభుత్వ పాఠశాల సైతం ఉండటం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలకు చెందిన ఏడు నియోజకవర్గాల ఈవీఎంలు, వివి పాట్లు భద్రపరిచిన ఆదిలాబాద్లోని టీటీడీసీలో స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. -
సామాజిక సేవ అభినందనీయం
[ 14-05-2024]
సఫా బైత్ ఉల్ మాల్ సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని రిమ్స్ సంచాలకుడు డాక్టర్ రాథోడ్ జైసింగ్ కొనియాడారు. -
శ్రీ నవశక్తి దుర్గామాత వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
[ 14-05-2024]
జిల్లా కేంద్రం దుర్గా నగర్ కాలనీలోని శ్రీ నవశక్తి దుర్గ మాత మందిరంలో మంగళవారం అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. -
జన్మదినం వేళ.. వైద్య విద్యార్థిని రక్తదానం
[ 14-05-2024]
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా. నరేందర్ రాథోడ్ కూతురు ఖుషి రాథోడ్ తన జన్మదినం సందర్భంగా రిమ్స్లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
ఉరేసుకుని యువకుడు బలవన్మరణం
[ 14-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ భవనంలో యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన వెలుగు చూసింది. -
ఓటెత్తిన పల్లెజనం!
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పల్లెజనం ఓట్లతో పోటెత్తారు. గుట్టలు ఎక్కుతూ, దిగుతూ, కాలినడకన కిలోమీటర్ల మేర మండే ఎండలో నడుస్తూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచారు. -
ఓటోత్సాహం..
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ఓటర్లు చైతన్యం చాటారు. నవ ఓటర్లు దయమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. దేశ భవితను నిర్ణయించే ఎన్నికల్లో తొలి ఓటు వేయడం మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు -
పోటెత్తిన ఓటరు చైతన్యం
[ 14-05-2024]
జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరడం స్ఫూర్తి నింపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు కష్టమైనా ఓటేశారు -
సీబీఎస్ఈ ఫలితాల్లో పారమిత ప్రభంజనం
[ 14-05-2024]
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్లోని పారమిత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రభంజనం సృష్టించారని పాఠశాల ఛైర్మన్ ఇ.ప్రసాదరావు తెలిపారు. -
మనం గెలుస్తున్నాం.. ఎమ్మెల్యేల సంబరం
[ 14-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. -
ఫలితాలకు 22 రోజుల నిరీక్షణ
[ 14-05-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతటితో ఓటర్ల పని పూర్తయినా.. నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. -
పోలింగ్ ముగిసె.. ఈవీఎంలు తిరిగొచ్చె!
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను తిరిగి పంపిణీ కేంద్రాలకు తీసుకొచ్చారు -
వాగు దాటి.... 3 కి.మీ. నడిచి!
[ 14-05-2024]
భీమిని మండలం తంగళ్లపల్లి గ్రామ ఓటర్లు వేటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి గ్రామంలో 303 మంది ఓటర్లు ఉన్నారు. -
ఓటు వేయడం అందరి బాధ్యత: కలెక్టర్
[ 14-05-2024]
ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా పాలనాధికారి, ఎన్నికల అధికారి అశిష్ సంగ్వాన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ