గిరిజనుల గోడు పట్టని వైకాపా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.
పుస్తకాలు ఆవిష్కరిస్తున్న కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, భాజపా, జనసేన నాయకులు
పాడేరు, న్యూస్టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం పాడేరులో జనసేన, భాజపా నాయకులతో భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజనుల గోడును వైకాపా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 2019 నాటికి నేరాల సంఖ్య 11,929గా ఉండగా.. 2022 నాటికి ఐపీసీ నేరాల సంఖ్య 1,58,547కి పెరిగిందన్నారు. 2022లో రాష్ట్రంలో 22 మంది చిన్నారులు హత్యకు గురయ్యారని చెప్పారు. రాష్ట్రంలో 948 మంది పెద్దలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. వైకాపా పాలనలో ప్రతిరోజు సగటున మూడు హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటికి బాధ్యులను చేస్తూ సీఎం జగన్పై ఛార్జిషీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జగన్ స్టిక్కర్లు పెట్టుకొని తమవిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు ప్రత్యేకమైన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను నవరత్నాల పేరిట దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీలకు వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారన్నారు. వైకాపా అరాచకాలపై రూపొందించిన పుస్తకాలు ఆవిష్కరించారు. జనసేన నాయకులు గంగులయ్య, భాజపా నాయకులు కృష్ణారావు, నేతలు రామకృష్ణ, చక్రవర్తి వెంకటరమణ, సుబ్బలక్ష్మి, భాస్కర్, సురేష్కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
[ 12-05-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూనే అడవి బిడ్డలను జగన్ నట్టేట ముంచారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను గిరిజనేతరుల చేతిలో పెట్టి సహజ వనరులను దోచుకున్నారు. -
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. -
కోడ్ ఉల్లంఘించి రోడ్డు పనులు ప్రారంభం
[ 12-05-2024]
జిల్లాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలు, నిర్మాణాలకు వైకాపా రంగులు వేసిన నాయకులు పోలింగ్ దగ్గరపడటంతో గిరిజన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోడ్ను ఉల్లంఘించి ఏకంగా రోడ్డు పనులు ప్రారంభించేశారు. -
నిఘా నీడలో మన్యం
[ 12-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన అల్లూరి జిల్లా పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
రెండేళ్లలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 12-05-2024]
పోలవరం నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి న్యాయం చేస్తుందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష హామీ ఇచ్చారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నోట్లతో ఓట్లవేట
[ 12-05-2024]
సార్వత్రిక సమరంలో ప్రచార పర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు చేసిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దఎత్తున కనిపించడంతో వైకాపా నేతలు కలవరానికి గురవుతున్నారు. -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన
[ 12-05-2024]
ఐదేళ్ల క్రితం జగన్ ఇదేమాట చెప్పారు. ఎన్నెన్నో చేస్తామన్నారు. అందరినీ ఉద్ధరిస్తా మన్నారు.. గద్దెనెక్కాక పాత పథకాలకు కొత్త పేర్లుపెట్టారు అన్నింటికీ బటన్లు నొక్కేశామన్నారు. -
రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్
[ 12-05-2024]
గత ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఒక్క అవకాశమంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. -
ప్రజల భూములు కాజేసే కుట్ర
[ 12-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసిందని ఎన్డీఏ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
దాడులపై డీజీపీ, ఈసీలకు గీత ఫిర్యాదు
[ 12-05-2024]
అడ్డతీగల మండలం ఎల్లవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉమ్మడి కూటమికి చెందిన కార్యకర్తలపై వైకాపా దాడులు చేయడం అమానుషమని అని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలో ఈనెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్