నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
మోతుగూడెం, న్యూస్టుడే
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం. తెదేపా హయాంలో రూ.అయిదు లక్షల పంచాయతీ నిధులతో ఈ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇది పూర్తయితే జిల్లా, డివిజన్ కేంద్రాల నుంచి వచ్చే ఉన్నతాధికారులు బస చేయటానికి ఉపయోగపడటమే కాకుండా, మోతుగూడెం పర్యటక ప్రాంతాల సందర్శనకు వచ్చే వారికి అద్దెకు గదులు కేటాయిస్తే, పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని భావించారు. శ్లాబు వేశాక నిధులు సరిపోకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ అసంపూర్తి భవనం పశువులకు నిలయంగా మారింది. ఓ గదిలో మతిస్థిమితం లేని మహిళ ఉంటుంది. ఈ భవనాన్ని ఇలాగే వదిలేస్తే భవనం శిథిలావస్థకు చేరి ప్రభుత్వ ధనం వృథా అవుతుంది. అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
అలా వదిలేశారు..
అనంతగిరి గ్రామీణం, న్యూస్టుడే: మన్యంలోని చాలా గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల పనులు పూర్తయినా ప్రారంభించలేదు. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నాలుగు ఏళ్లు గడుస్తున్నా భవనాలు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతగిరి మండలంలోని బీంపోలు పంచాయతీ కేంద్రంలో సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు చర్యలు తీసుకుని దీన్ని అందుబాలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
మోతుగూడెంలో అసంపూర్తిగా అతిథి గృహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బారులు తీరి.. కూటమికి బాసటగా నిలిచి..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్ను రెండు గంటల ముందుగా ముగించారు. -
మా ఓట్లు తొలగించారు..!
[ 14-05-2024]
ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించారంటూ కిర్రాబుకు చెందిన పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
మారేడుమిల్లిలో యువత సందడి
[ 14-05-2024]
దేశంతోపాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు పొంది, వినియోగించుకోవడం ద్వారా తమ వంతు బాధ్యతను నిర్వర్తించామని యువ ఓటర్లు అభిప్రాయపడ్డారు. -
మొరాయించిన ఈవీఎం... ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఈవీఎం, వీవీ ప్యాట్ల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. -
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతం..
[ 14-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం చింతపల్లిమండలంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చింతపల్లి, చౌడుపల్లి, లోతుగెడ్డ, బైలుకించంగి, అన్నవరం, బలపం, కుడుముసారి పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయాన్నే రద్దీ నెలకొంది -
ఓటర్లతో వెళుతున్న వ్యాన్ బోల్తా
[ 14-05-2024]
-
జిల్లాలో 53.83 శాతం పోలింగ్
[ 14-05-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 53.83 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. -
వీరూ.. ఉత్సాహంగా ఓటేశారు
[ 14-05-2024]
వృద్దులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారూ ఓపిక చేసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు