మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా.
బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు
వైకాపా నాయకులను నిలదీసిన రైతులు
మునగపాక, న్యూస్టుడే: రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. ఉన్న ఇల్లు శిథిలమవడంతో పక్కా గృహం మంజూరు చేయండని కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు వైకాపాకు ఓటేయండని అడగడానికి ఎలా గొచ్చారు? అంటూ సమావేశానికి వచ్చిన వైకాపా నాయకులను పెంటకోట శ్రీనివాసరావు నిలదీశారు. తమ పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఉండడంతో బ్యాంకు రుణం మంజూరు కాలేదని, తమ పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఏంటని మరో రైతు ఆళ్ల రాము నిలదీశారు. వీరి ప్రశ్నలకు వైకాపా నాయకులు తెల్లముఖం వేశారు. మునగపాక పాటిదిబ్బ ప్రాంతంలో ఆదివారం రాత్రి పాటిదిబ్బ, ఉపరిదిబ్బ, పురిటిగెడ్డ, ముసిలితల్లి మూలసంఘాల రైతులతో జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామిసత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు సూరిశెట్టి రాము తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత రైతులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని అభ్యర్థించారు. మా సమస్యల్ని పట్టించుకోలేని వారు ఇప్పుడు ఓటెలా అడగడానికి వచ్చారంటూ వీరు నిలదీశారు. స్థలాలు ఉండి కూడా కొందరు ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు పొందారని పలువురు ఆరోపించారు. మునగపాక-కశింకోట రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వెనుకంజ వేశారన్నారు. ఇళ్ల పట్టాల విషయమై వైకాపా కార్యకర్తల్లోనే వాగ్వాదం జరిగింది.ఈ పరిస్థితుల్లో కొందరు నాయకులు అక్కడ నుంచి జారుకున్నారు. మునగపాక ఎన్టీఆర్ కాలనీలో ప్రచారం చేపట్టిన వైకాపా నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలంలో అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మించొద్దని అడ్డుకొన్న తమపై కేసులు ఎలా బనాయించారని ప్రశ్నించారు. కేసులు ఉపసంహరించుకున్న తరవాతే ప్రచారానికి రండి అంటూ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM