పందేల జాతర
సంక్రాంతి సంప్రదాయం మాటున జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు జూదక్రీడలు కొనసాగాయి. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ముందస్తుగా చేసిన హెచ్చరికలు నామమాత్రమే అయ్యాయి. ప్రధాన రహదారుల చెంతనే బహిరంగ బరులు, పేకాట శిబిరాలు
తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లడ్లైట్ల వెలుగులో జరిగిన కోడిపందేలు
సంక్రాంతి పర్వదినాల్లో చట్టపరంగా ఎన్ని హెచ్చరికలు చేసినా చాటుమాటుగా పందేలు, పేకాట వంటివి సర్వసాధారణ విషయాలే. ప్రస్తుతం యావత్ దేశాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న ఒమిక్రాన్ విస్తరణకు జూదక్రీడలు మరింత దోహదపడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు గతానికి భిన్నంగా దృష్టి సారిస్తారని భావించారు. అందుకు తగ్గ విధంగానే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఆచరణకు నోచుకోలేదు. భోగి ముందు వరకూ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేయడంతో పాటు పలువురిని బైండోవర్ చేసినా, మూడు రోజులకు అనుమతులొచ్చాయంటూ జూద నిర్వాహకులు చేసిన ప్రచారం వాస్తవమే అన్పించేలా ఫ్లడ్లైట్ల వెలుగుల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పందేలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో కనీసం రెండుకు తగ్గకుండా పెద్దబరులు ఏర్పాటు చేశారు. వీటీల్లో ఒక్కో కోడిపందేనికి కనీసం రూ.లక్ష నుంచి పైచిలుకు నిర్ధారించారు. పేకాటకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసుకున్నారు. వీటికితోడు నెంబర్లాట, చిత్తాట, గుండాట, వంటి జూదక్రీడలు కూడా పెద్దమొత్తాలతో నిర్వహించారు. గుడివాడ, కైకలూరు, జగ్గయ్యపేట, తిరువూరు, పెండ్యాల కంచికచర్ల, తదితర ప్రాంతాల పరిధిలో నిర్వహించిన పందేలకు పొరుగు జిల్లాకు చెందిన వారు తరలివచ్చారు. బరి మామూళ్లు, మద్యం, ఇతర తినుబండారాల విక్రయ దుకాణాల ఏర్పాటు తదితరాల పరంగా నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. గడచిన ఏడాది తరహాలోనే బాపులపాడు మండలం అంపాపురంలో వివిధ హంగుల నడుమ భారీ పందేలు వేశారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి, పరిటాల, మచిలీపట్నం మండలం మేకావానిపాలెం, చల్లపల్లి, కొడాలి, కొక్కిలిగడ్డ ప్రాంతాల్లో రూ.లక్షల్లో చేతులు మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో విరామం లేకుండా జూదం సాగే విధంగా ఫిష్ట్ల వారీ జూద నిర్వాహకులను ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు సైతం వీటిని తిలకించేందుకు వచ్చారు. మోపిదేవి సమీపంలో పై పందేలతో సంబంధం లేకుండా గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ కోడి పందెం నిర్వహించారు. పేకాటలో పాల్గొనేందుకు రుసుములు వసూలు చేశారు. వత్సవాయి మండలం లింగాల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, మచిలీపట్నం మండలం శ్రీనివాసనగర్, మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, తదితర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణల కారణంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లింగాలలో గ్రామస్థులే పందేలను అడ్డుకున్నారు.
1,141 కేసులు.. 3,494 మంది అరెస్ట్
గడచిన వారం రోజులుగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 1,141 కేసులు నమోదు చేసిన పోలీసులు 3,494 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందేలకు సంబంధించి 464 కేసులు నమోదు చేసి రూ.6.57 లక్షలు, 44 పెట్టీ కేసుల్లో రూ.99,650, పేకాటకు సంబంధించి 355 కేసుల్లో రూ.7.05 లక్షలు, 278 పెట్టీ కేసుల్లో రూ.6.11 లక్షలతో పాటు 583 కోడిపుంజులు, 75కి పైగా బైక్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నారై రంగనాథ బాబు ప్రచారం
[ 03-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాల శౌరిని గెలిపించాలని నాయకులు ప్రచారం చేశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
[ 03-05-2024]
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
సైకిలెక్కిన సర్పంచి.. సొంతూరులో వంశీకి షాక్
[ 03-05-2024]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్వగ్రామం ఉంగుటూరు వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్ గురువారం తెదేపాలో చేరారు. -
వికృత క్రీడతో.. విల‘పింఛెను’
[ 03-05-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు ఆడిన జగన్నాటకానికి పింఛనుదారులు నరకం చవిచూశారు. వైకాపా అరాచకం.. ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో పింఛనుదారులు గురువారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కిట్టూ దర్శకత్వం.. నీలిమూకల అరాచకం!
[ 03-05-2024]
వైకాపా యువనేత, మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టూ అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు ఎదురేముంది అన్నట్లు అనుచరులను ప్రోత్సహిస్తూ.. పట్టపగలే దాడులకు ఉసిగొల్పుతున్నారు. -
గుడివాడ, అవనిగడ్డలో పవన్కల్యాణ్ పర్యటన రేపు
[ 03-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం 6 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కట్టలు బలహీనం.. కట్టలేక విహీనం
[ 03-05-2024]
తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న సముద్ర కరకట్టలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా వైకాపా సర్కరు అయిదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా ప్రాంతాల్లో గుంతలు, గండ్లు ఏర్పడి కరకట్టలు బలహీనపడ్డాయి. -
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితంలా ఉంది
[ 03-05-2024]
వైకాపా ఎన్నికల ప్రణాళిక తెల్లకాగితం మాదిరిగా ఉందని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ.10 ఇచ్చి రూ.1000 లాగేసే విధంగా వారి మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. -
‘చంద్రబాబును గెలిపించుకుందాం’
[ 03-05-2024]
పింఛనుదారుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం ఓ చరిత్ర అని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ అన్నారు. -
నమ్మించారు.. నట్టేట ముంచారు
[ 03-05-2024]
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి ఉద్యోగులంతా ఆనందపడ్డారు. అనంతరం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవడంతో అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. -
హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
[ 03-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కొండకు గుండు కొట్టారు.. అందినంత మింగేశారు
[ 03-05-2024]
ఆంధ్రాలో సహజ వనరుల దోపిడీలో మట్టి మాఫియా విధ్వంసానికి అడ్డు లేకుండాపోయింది. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరించడం, తనిఖీలు చేసే అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. -
ప్రలోభ రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు
[ 03-05-2024]
ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రలోభాలు లేని వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలా... తూచ్. అవి ప్రతిపక్షాలకే గానీ.. మాకు కాదు అంటున్నారు విజయవాడ సెంట్రల్లోని అధికార వైకాపా నేతలు. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ... బరి తెగిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు, నివాసాలపై విచ్చలవిడిగా వైకాపా స్టిక్కర్లు అంటించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల తీర్పునకు వేళాయె..!
[ 03-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి వీలుగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. వీటిని వినియోగించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు. -
కేంద్ర బలగాల కనుసన్నల్లో సెంట్రల్ ఓటింగ్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి, లక్షలాదిగా పట్టుబడిన వైకాపా కుక్కర్ కూపన్లు.. కేసులకు కేంద్రమైంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. -
‘అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం’
[ 03-05-2024]
అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైకాపాను సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా పిలుపు నిచ్చారు. గురువారం వల్లూరుపాలెం, పాములలంక, తోట్లవల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నడవలేని వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు
[ 03-05-2024]
ఇళ్లలో మంచం నుంచి కదల్లేని వయోవృద్ధులకు గురువారం ఇంటి వద్దే ప్రత్యేక ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహించి వారితో ఓటు వేయించారు. నియోజకర్గంలో గురువారం 166 మందితో ఓటు వేయించారు. -
అహంకారి నానికి గుణపాఠం చెప్పాలి: రాము
[ 03-05-2024]
అసమర్థ వైకాపా ప్రభుత్వానికి, అహంకారి నానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
కనీస వసతులూ కల్పించరా నానీ
[ 03-05-2024]
గుడివాడ పట్టణంలోని పాటి మీద ప్రాంతంగా పిలిచే జగన్నాథపురానికి ప్రత్యేకత ఉంది. 31, 32 వార్డుల పరిధిలో చరిత్రక వెంకటేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఆఫీసర్స్ క్లబ్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM