మాతా శిశు మరణాలు నమోదైతే చర్యలు: డీఎంవో
ప్రజల చెంతకు వైద్యారోగ్యశాఖ పథకాలను సమర్థంగా తీసుకువెళ్లాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) రామారావు సూచించారు.
వైద్యారోగ్యశాఖ పథకాలపై సమీక్షిస్తున్న మలేరియా అధికారి
పెడన, న్యూస్టుడే: ప్రజల చెంతకు వైద్యారోగ్యశాఖ పథకాలను సమర్థంగా తీసుకువెళ్లాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) రామారావు సూచించారు.మండలంలోని చేవేండ్రపాలెం పీహెచ్సీలో వైద్యారోగ్యశాఖ పథకాలపై శుక్రవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంవో మాట్లాడుతూ మాతా శిశు మరణాలను పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోందని ఎక్కడైనా ఈ తరహా మరణాలు నమోదైతే శాఖాపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. జాతీయ టీకాల కార్యక్రమం అమలు తీరును సమీక్షించారు. తెలంగాణాలో మీజిల్స్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో చిన్నారులకు ఈటీకాలను షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలని ఆదేశించారు. ఎంఎల్హెచ్పీల విధులపై సమీక్షిస్తూ వీరు తమ కేంద్రాల్లో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చేవేండ్రపాలెం పీహెచ్సీలో ప్రసవాలు చేయాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభించాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యాధికారులు డా.వరప్రసాద్బాబు డా.ప్రదీప్కుమార్, ఎంపీహెచ్ఈవో ఉమామహేశ్వరరావు, సూపర్వైజర్ సీహెచ్వీఎల్ కుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన నేతపై.. అనురాగ జల్లు
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గన్నవరం వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్తో పాటు, స్థానిక వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. -
బాబుపై పగ.. రైతన్నకు దగా!
[ 11-05-2024]
ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోరే సమర్థులైన పాలకులైతే ఏం చేస్తారు? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చేవారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు తప్పనిసరి
[ 11-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. -
వరములీయవే.. మహాలక్ష్మీ
[ 11-05-2024]
ఇంద్రకీలాద్రి: అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. -
ఓట్ల పండగకు వస్తున్నారోచ్..
[ 11-05-2024]
రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండగలో పాల్గొనేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. -
ఊళ్లన్నారు... ఎక్కడ వంశీ?
[ 11-05-2024]
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. -
సీఎం హామీ కృష్ణార్పణం
[ 11-05-2024]
కృష్ణా కుడి, ఎడమ కరకట్టల మరమ్మతులకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలో పనులు ప్రారంభించి పటిష్ఠపరుస్తాం. -
సంక్షేమమన్నారు.. మాకేమి చేశారు
[ 11-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తాం. మహిళలకు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చి ఆర్థ్ధికంగా ఆదుకుంటాం. -
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
[ 11-05-2024]
‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 11-05-2024]
మాదిగలకు అండగా నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
ఇండియాకు ఓటేయండి.. మీ భవితను నిర్ణయించుకోండి
[ 11-05-2024]
రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే.. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. -
గంజాయికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
[ 11-05-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె.లక్ష్మి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం