logo

కాంగ్రెస్‌ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా భార్గవ్‌

Published : 22 Apr 2024 05:04 IST

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్‌ను ఎంపిక చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ అదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు, ఎంబీఏ చదివిన భార్గవ్‌ను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ‘ప్రజల కోసం కాంగ్రెస్‌’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తానని తెలిపారు. ఆయన తండ్రి వల్లూరు అశోక్‌ పారిశ్రామికవేత్తగా నగరవాసులకు సుపరిచితులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని