logo

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం

రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 05:07 IST

భవానీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. భవానీపురం 42, 43 డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ జగన్‌ వంటి నియంతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా పశ్చిమాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధా, మాజీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న, నాయకులు నాగుల్‌మీరా, అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని