‘ఓటమి భయంతోనే గులక రాయి డ్రామా’
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు.
గాంధీనగర్, న్యూస్టుడే : ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కోడి కత్తితో డ్రామా ఆడగా.. ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో మాదిగ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. 27 దళిత పథకాలను రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని దుయ్యబట్టారు. దళితులపై దాడులకు స్పందించని జగన్కు.. ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలంటే తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలని సంఘీయులను కోరారు. ఈ సమావేశంలో నాయకులు పి.రమేష్, కె.బెంజిమెన్, వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్