జగనన్న తప్పులు.. జనానికి తిప్పలు
సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు.
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం, అవనిగడ్డ
సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. కొన్ని చోట్ల నిర్మించినా నివాసం ఉండలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.152.28 కోట్ల అంచనాతో 219.15 ఎకరాల్లో 8,941 ప్లాట్లు వేసి 8,460 గృహాలు మంజూరు చేశారు. 2020 డిసెంబర్లో నవరత్నాలు పేరుతో ప్రారంభించిన పనులు ఇప్పటికీ నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు. కొన్ని గృహాలు పూర్తయినా రహదారులు, విద్యుత్తు, తాగునీటి వసతి లేక నివాసం ఉండడం లేదు. భారీ వర్షాలు కురిస్తే ఇల్లు ఖాళీచేసి రావాల్సిన దుస్థితి. కొన్ని కాలనీలు ఇప్పటికీ మెరక చేయలేదు. మరికొన్ని లేఔట్లలో తూతూమంత్రంగా పనులు చేసి వైకాపా గుత్తేదారులు లబ్ధిపొందారు. మెరక చేసిన తర్వాత కూడా మోకాలు లోతు నీరు నిలిచి తగ్గడానికి పక్షం రోజులు పట్టింది.
- గుడివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో 24 చోట్ల జగనన్న కాలనీలు ప్రారంభించారు. కోర్టు వివాదం వల్ల వలివర్తిపాడులో ఒకటి రద్దు చేశారు. రెండో లేఔట్లో పట్టాలిచ్చినా ఒక్కరికీ గృహనిర్మాణ రుణం మంజూరు చేయలేదు. చేపల చెరువుల వద్ద స్థలాలివ్వడంతో శేరీగొల్వేపల్లిలో ఒక లేఔట్ రద్దు చేశారు. కల్వపూడి అగ్రహారంలో చెత్త వేసే చోట స్థలాలిచ్చారని గ్రామస్థులు నిరాకరించడంతో అదీ రద్దు చేశారు. మోటూరు రైల్వే స్టేషన్ వద్ద లేఔట్లో అడుగు పెట్టలేని పరిస్థితి. మండలం మొత్తం మీద 21 లేఔట్లో 868 మందికి పట్టాలి చ్చారు. వారితో పాటు సొంత స్థలం ఉన్న 372 మందికి కలిపి 1240 మందికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశారు. వారిలో 280 మంది నిర్మాణం ప్రారంభించలేదు.
రోడ్లు వేయాలి
- ఓ లబ్ధిదారు
మల్లాయపాలెం కాలనీలో అంతర్గత రోడ్లు గుంతలమయం అయ్యాయి. ట్రాక్టరుతో నిర్మాణ సామగ్రి తీసుకెళ్లాలన్నా ఇబ్బందే. మేమే ఇటుక ముక్కలు వేసుకొని సామాగ్రి తరలించుకోవాల్సిన దుస్థితి.
తాగునీటికీ ఇబ్బందే
- ఆకునూరి కమలకుమారి, కొండిపర్రు
పామర్రు మండలం కొండిపర్రులో మాకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాలనీలో రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్తు లైన్లు వేయలేదు. స్థలాలిచ్చి మీ చావు మీరు చావండన్నట్లు ఉంది.
వసతుల కల్పనలో నిర్లక్ష్యం
- యలవర్తి మునీశ్వరరావు, కొత్తపేట
రహదారులు అభివృద్ధి చేయలేదు. మెరక చేసిన తర్వాత కూడా కాలనీలు వర్షపు నీటిలో ఉన్నాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్తు వసతి లేదు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించాలి
- గృహిణి
మల్లాయపాలెం జగనన్న కాలనీలో కనీస వసతులు లేవు. నీరు, రోడ్లు, డ్రెయిన్లు లేవు. ఇక్కడ నివాసం ఉండడం చాలా కష్టం. గత్యంతరం లేక ఉంటున్నాము. అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. పైసాచికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. దారి మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం