జీతాలు అందక.. జీవనం గడవక
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.
వేతన జీవుల వెతలు పట్టని వైకాపా సర్కార్
ఎన్టీఆర్ కలెక్టరేట్, చుట్టుగుంట, న్యూస్టుడే: ఒప్పంద/పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. పొరుగు సేవల ఉద్యోగులు, పలువురు ఒప్పంద ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో రెండు లేదా మూడు నెలలకోసారి ఇస్తున్నారు. జీవనం కష్టంగా ఉంటోందని వివిధ శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పథకాల కింద పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా సంస్థల నుంచి నిధుల విడుదలను బట్టి జీతాలు చెల్లిస్తున్నారు. సాంకేతిక సమస్యలు, మూడేసి నెలలకు ఒక సారి బడ్జెట్ కేటాయింపులు వంటి కారణాలతో జీతాలు అందడం లేదు. చిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
క్రమబద్ధీకరణ చేయకుండా...
ఒప్పంద ఉద్యోగులను ఒక ఏడాదికి మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. మార్చి 31వ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీరి కాల పరిమితి ముగస్తుంది. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తారు. ఏటా ఇదే తంతు తప్పడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. ఉద్యోగులు ఎదురు చూపులు చూస్తున్నారు. మరోవైపు వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి స్థాయిలో జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న తరహా కేసులను బూచీగా చూపారని, వీటిని పరిష్కరించడానికి అవకాశం ఉన్నా, పక్కనపెట్టి క్రమబద్ధీకరణ చేయలేదంటూ విమర్శిస్తున్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే : ఓ ఉద్యోగిని
మాకు తల్లిదండ్రులు లేరు. ఇద్దరు ఆడ పిల్లలు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో భర్త చేయి విరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. నెల నెలా జీతం కోసం ఎదురు చూపులు చూడాల్సిందే.
తల్లిదండ్రులకు వైద్యం చేయించలేకపోతున్నా : ఓ ఉద్యోగి
ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక పొరుగు సేవల్లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్)గా చేరాను. ఈ ప్రభుత్వంలో నెల నెలా జీతం అందక ఇబ్బంది పడుతున్నాను. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వారికి అనారోగ్యం. సరైన వైద్య చికిత్స చేయించలేకపోతున్నా.
పరువు పోతోంది : ఓ ఉద్యోగి
నిత్యావసరాలు, అద్దెలు బాగా పెరిగాయి. ప్రతి నెలా నేను పడిన కష్టానికి జీతం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నాను. రెండు నెలల జీతం పెండింగ్ ఉంది. అది వస్తేనే కుటుంబం గుడుస్తుంది. ఇంటి యజమానికి ప్రతి నెలా కచ్చితంగా అద్దె చెల్లించాలి. ఇవ్వకపోతే రోడ్డు మీదే అడుగుతున్నారు. పరువు పోతోంది. అప్పులపాలవ్వాల్సి వస్తోంది.
ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా..
రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పడడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా బడ్జెట్లో పెరుగుదల లేకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 మందికే ఆహారం వండి.. దాన్ని 200ల మందికి వడ్డిస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక కేడర్లోని ఉద్యోగులకు ఒక నెలలోనూ, మరో కేడర్లోని వారికి ఆ తర్వాత నెల.. ఇలా విడతల వారీగా జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారని దుయ్యబడుతున్నారు.
అవసరాలకు అప్పులు చేసి...
కుటుంబాల నిర్వహణకు ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నెలవారి అద్దెలు, పాలు, విద్యుత్తు, కూరగయాలు, పిల్లల చదువులు, వైద్యం.. వంటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. సకాలంలో జీతం రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి అవమానాలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా.. ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్