ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయండి
మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు.
-బొండా డిమాండ్
అజిత్సింగ్నగర్ (మధురానగర్), న్యూస్టుడే : మే 1న ఇంటి వద్దనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. ఒక్క రోజు ఆలస్యమైనా.. మరణాలు సంభవించినా దానికి జగన్ సర్కారు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. శనివారం అజిత్సింగ్నగర్లోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి తన రాజకీయ ప్రాబల్యం కోసం ఏప్రిల్లో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వల్ల సచివాలయాల వద్దకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది వరకు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని ఒక్క రోజులోనే పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. మే 1న ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని దిల్లీలోని భారత ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు వివరించారు. ప్రభుత్వం వద్ద అధికారులు, సిబ్బంది ఉన్నా.. జగన్మోహన్రెడ్డి తన రాజకీయం కోసం దారుణానికి ఒడిగడుతున్నారని మండిపడ్డారు. పింఛన్ల డబ్బులు ఉంచకుండా మార్చి 16-30 మధ్య రూ.13వేల కోట్లు తన సొంత గుత్తేదారులకు దోచి పెట్టారని దుయ్యబట్టారు. ఫలితంగా పింఛన్లకు నిధుల కొరత వచ్చిందన్నారు. అవ్వా తాతలను ఎండలో తిప్పి వారిలో ఎవరైనా చనిపోతే దాన్ని విపక్షాలకు అంటగట్టి శవరాజకీయాలు చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో బాబాయి హత్య, కోడి కత్తి డ్రామాలాడి లబ్ధి పొంది రాష్ట్రాన్ని దోచుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు నెలకు రూ.4వేల చొప్పున పింఛను ఇస్తారని, దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దివ్యాంగులకు రూ.6వేలు, 50 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన నేతపై.. అనురాగ జల్లు
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గన్నవరం వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్తో పాటు, స్థానిక వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. -
మాటలేనా.. చేతలేవని?
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి రాగానే గుడివాడను సుందరంగా తీర్చి దిద్దుతానని, భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేస్తాననీ కొడాలి నాని గతంలో పలుమార్లు పలు సభల్లో నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. -
సీఎం హామీ కృష్ణార్పణం
[ 11-05-2024]
కృష్ణా నది వరదల నుంచి రక్షణ కవచంగా ఉన్న 90 కిమీ పొడవు ఉన్న కుడి, ఎడమ కరకట్టలు మరమ్మతులకు నోచుకోక బలహీనపడ్డాయి. నది పరీవాహక గ్రామాలకు రహదారి సౌకర్యంగా ఉన్న కరకట్టలు నేడు గండ్లుపడి బీటలు వారుతున్నా పట్టించుకోలేదు. -
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
[ 11-05-2024]
‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
బాబుపై పగ.. రైతన్నకు దగా!
[ 11-05-2024]
ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోరే సమర్థులైన పాలకులైతే ఏం చేస్తారు? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చేవారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు తప్పనిసరి
[ 11-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. -
వరములీయవే.. మహాలక్ష్మీ
[ 11-05-2024]
ఇంద్రకీలాద్రి: అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. -
ఓట్ల పండగకు వస్తున్నారోచ్..
[ 11-05-2024]
రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండగలో పాల్గొనేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. -
ఊళ్లన్నారు... ఎక్కడ వంశీ?
[ 11-05-2024]
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. -
సంక్షేమమన్నారు.. మాకేమి చేశారు
[ 11-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తాం. మహిళలకు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చి ఆర్థ్ధికంగా ఆదుకుంటాం. -
మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 11-05-2024]
మాదిగలకు అండగా నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
ఇండియాకు ఓటేయండి.. మీ భవితను నిర్ణయించుకోండి
[ 11-05-2024]
రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే.. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. -
గంజాయికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
[ 11-05-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె.లక్ష్మి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి