logo

చంద్రబాబుతోనే సంక్షేమం

చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు.

Published : 28 Apr 2024 03:46 IST

గూడూరు:  చంద్రబాబుతోనే సంక్షేమం సాధ్యమని తెదేపా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాదు సతీమణి శిరీష అన్నారు. శనివారం ఆమె కూటి శ్రేణులతో కలిసి మండల పరిధిలోని తరకటూరు, జక్కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె సూపర్‌-6 పథకాల గురించి వివరించారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి మినహా ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందేమి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు సైకిల్‌ గుర్తు, ఎంపీ ఓటు గాజుగ్లాసు గుర్తుపై  వేసి ఆశీర్వదించాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి, కేడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ తలుపుల కృష్ణ, నాయకులు గోపి నాగబాబు, శాయన సోమయ్య, కాట్రగడ్డ రత్నబాబు, ఎన్‌ఏబేగ్‌, మత్తి సత్యనారాయణ, కాట్రగడ్డ కృష్ణ, రాంబాబు, మత్తి సుబ్రహ్మణ్యం, గళ్లా ఆంజనేయులు, అంబటి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని