logo

అభివృద్ధే ఆకాంక్ష..ఆశీర్వదించండి: కొల్లు

బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.

Published : 29 Apr 2024 05:11 IST

మచిలీపట్నం(గొడుగుపేట): బందరు అభివృద్ధే తమ ఆకాంక్ష అని..నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 4, 5 డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌ తదితరులతో కలిసి పర్యటనలో పాల్గొనగా ప్రజలనుంచి ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. రవీంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే పేర్ని నాని పలు సమావేశాల్లో బందరు ప్రజలు పిచ్చోళ్లని అన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ అలాంటి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా హయాంలో అనేక ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుత ఎమ్మెల్యేకి తన కొడుకు రాజకీయం గురించి ఆలోచించడం మినహా ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. ఎంపీ ఓటు గాజుగ్లాసు,  ఎమ్మెల్యే ఓటు సైకిల్‌ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని