logo

నందిగామలో ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్‌ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 29 Apr 2024 20:48 IST

నందిగామ గ్రామీణం : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని రుద్రవరం, సోమవరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీరామ్‌ రాజగోపాల్ తాతయ్య తెదేపా, భాజపా, జనసేన  పార్టీల నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌ (చిన్ని), జగ్గయ్యపేట నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని  కోరారు.

తెదేపాలో చేరిన వైకాపా నాయకులు

రుద్రవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి మరియదాసుతో పాటు మరో 5 కుటుంబాలు అధికార వైకాపాను వీడి శ్రీరామ్‌ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెదేపాలో చేరాయి. వారి వెంట తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని