వైకాపాను సాగనంపుదాం
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం, కల్హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
28వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న కాలవ శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలు
రాయదుర్గం, బొమ్మనహాళ్, న్యూస్టుడే: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం, కల్హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టణంలోని 8, 27వ వార్డులో కాలవ విజయలక్ష్మి ఇంటింటి ప్రచారం జరిపి తన భర్త కాలవ శ్రీనివాసులును గెలిపించాలని కోరారు.
ఇంటింటా ప్రచారం
శెట్టూరు: మండలంలో లింగదీర్లపల్లి, బచ్చహళ్లి, కనుకూరు, ముచ్చర్లపల్లి, అనుంపల్లి గ్రామాల్లో శనివారం తెదేపా నాయకులు ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ తిప్పేస్వామి, నాయకులు రామరాజు, అశ్వర్థ, పాల్గొన్నారు.
పార్టీని ఆదరించండి
డి.హీరేహాళ్: ఎన్నికల్లో తెదేపాను ఆదరించాలని పార్టీ కన్వీనర్ హనుమంతురెడ్డి కోరారు. నాగలాపురం గ్రామంలో సూపర్సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీనియర్ నాయకులు కాదలూరు మోహన్రెడ్డి, పాటిల్అజయ్కుమార్రెడ్డి, గంగాధర, మల్లికార్జున, గోవింద్, వెంకటేశులు, తిప్పేస్వామి, పాల్గొన్నారు.
బాబు రావాలి.. బతుకులు మారాలి
కణేకల్లు: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అందరి బతుకులు మారతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ తనయుడు వీక్షత్, ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు కుమార్తె గౌతమి పేర్కొన్నారు. కొత్తపల్లిలో మండల కన్వీనర్ లాలెప్ప, నాయకుడు ఆనందరాజు, వన్నారెడ్డితో కలిసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
కంబదూరు, కుందుర్పి: కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి, కోడలు ఇషిత శనివారం మండల పరిధిలోని కర్తనపర్తి, కె.కొత్తూరు, డి.చెన్నేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కుందుర్పి మండలంలోని బండమీదపల్లి, బొమ్మాజిపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాలో అమిలినేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి, కుమార్తె చరిత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
చంద్రబాబుతోనే రైతుల సంక్షేమం
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రైతులకు ఎలాంటి రాయితీ పరికరాలు అందించలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలా ఆదుకుంటారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ అన్నారు. శనివారం మండలంలోని మానిరేవు, గోళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముడుపులివ్వలేదని కేతిరెడ్డి పునాది కూల్చేయించాడు
[ 12-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ముడుపులు ఇవ్వలేదని నేసేపేటలో తనకు చెందిన ఇంటి పునాదిని కూల్చివేయించారని ధర్మవరం చెందిన భాజపా మాజీ కౌన్సిలర్ కేతా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
విధ్వంస కారక.. పాశవిక పాలక
[ 12-05-2024]
ఒట్టిపోయిన జలాశయాలు.. బీళ్లుగా మారిన పొలాలు.. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఆనవాళ్లు. విద్యార్థులకు భరోసా.. యువతకు ఉపాధి లేకుండా చేశారు. అక్కాచెల్లెమ్మలకు చేయూత, అవ్వాతాతలకు పూర్తిస్థాయిలో ఆసరా ఇవ్వలేదు. -
చౌకగా కొట్టేసి.. అస్మదీయులకు కట్టబెట్టి
[ 12-05-2024]
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో.. జాతీయ రహదారి పక్కన.. వేల ఎకరాల్లో ఉన్న ఆ పేదల భూములపై పెద్దల కన్ను పడింది. రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి.. ఎంతోకొంత ముట్టజెప్పి.. ఒకటి కాదు.. రెండు కాదు పదివేల ఎకరాల భూమిని సేకరించేశారు. -
మూగబోయిన మైకులు
[ 12-05-2024]
జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఊదరగొట్టిన మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. కీలక రాజకీయ పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ.. -
అనంత రైల్వేస్టేషన్ కిటకిట
[ 12-05-2024]
ఎన్నికల వేళ జిల్లా మీదుగా నడుస్తున్న రైళ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. వలస కూలీలు తమ ప్రాంతాలకు ఓటు వేయడానికి ప్రయాణం కావడంతో అనంతపురం రైల్వేస్టేషన్ శనివారం కిటకిటలాడింది. -
ఓట్ల పండగకు సర్వం సిద్ధం
[ 12-05-2024]
‘ఐదేళ్లకోసారి ఓటర్ల చేతిలో ఉండే వజ్రాయుధాన్ని ఉపయోగించే సువర్ణ అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం’ -
తెదేపా తెచ్చిందని.. వైకాపా వదిలేసింది..
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనంతా రివర్స్లోనే నడిచింది. పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న ఉద్దేశంతో తెదేపా పాలనలో పెనుకొండ మండలంలో కియా పరిశ్రమను తీసుకొచ్చింది. -
అధికారమే అండగా చెరువుల చెర
[ 12-05-2024]
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి సామాజిక బాధ్యతతో పూర్వీకులు చెరువులు, కుంటలు నిర్మించారు. వాటిని గత ప్రభుత్వాలు సంరక్షించుకుంటూ వచ్చాయి. -
జానెడు రోడ్డు వేశారా.. చెరువుకు నీరు తెచ్చారా?: సునీత
[ 12-05-2024]
తెదేపా హయాంలో 2014-19 వరకు నేను చేసిన అభివృద్ధి పనులు చూశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రకాష్రెడ్డి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. -
దుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి
[ 12-05-2024]
రాయదుర్గం వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వ్యాపారులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 12-05-2024]
లారీ డ్రైవర్ను కొడుతున్న వైకాపా నాయకులను అడ్డుకున్న తెదేపా కార్యకర్తను అధికార పార్టీ నాయకుడు కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. -
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలెందుకు కల్పించలేదు?
[ 12-05-2024]
పోలింగ్ సమీపిస్తున్నా.. కేంద్రాల్లో ఇంత వరకు సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ఆర్వో, జేసీ కేతన్ గార్గ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బెళుగుప్ప, వజ్రకరూరులో ఆర్వో పర్యటించారు. -
కొత్త చట్టంతో భూములు లాక్కునేందుకు జగన్రెడ్డి యత్నం
[ 12-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మన తాతలు సంపాదించిన ఆస్తులు, భూములను లాక్కునేందుకు జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం
[ 12-05-2024]
కూటమి ప్రభుత్వంతో సంక్షేమం సాధ్యమని, కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును గెలిపించాలని మండల తెదేపా నాయకులు పేర్కొన్నారు. -
మంత్రి ఇలాఖాకు జలాలు.. రైతులకు కన్నీళ్లు
[ 12-05-2024]
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం అడుగుంటుతోంది. దాంతో బోరుబావుల్లో నీటిమట్టం పడిపోయింది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ