భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు.
నిరుపయోగంగా మరుగుదొడ్లు, స్నానాల గదులు
కదిరి, న్యూస్టుడే : శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక భక్తులు సాధారణ రోజుల్లో 2, 3 వేలు, శని, ఆదివారం, సెలవులు, పర్వదినాల్లో 30 వేల మందిదాకా దర్శించుకుంటారు. బయట నుంచే భక్తులకు కల్పించాల్సిన వసతులపై నిర్లక్ష్యం, నిర్వహణపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో దర్శన భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, స్నానాలు, దర్శన మార్గంలో రద్దీ వంటి భక్తుల కష్టాలు భగవంతునికే ఎరుక అన్న చందంగా మారాయి. సదుపాయం ఉన్నా నిర్వహణ అధ్వానంగా మారిందని భక్తులు వాపోతున్నారు. భక్తుల కష్టాలు భగవంతుడే తీర్చాలని మొరపెట్టుకుంటున్నారు..
కనీస వసతులేవీ..?
ఖాద్రీశుని దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అత్యవసరాలు, స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు సదుపాయాలు ఉన్నాయి. వాటి నిర్వహణ లోపమే వినియోగానికి కష్టంగా మారింది. కోనేరుకు ఎదురుగా ఉన్న ఉద్యానవన స్థలంలో రెండు కంటైనర్ మరుగుదొడ్లు, స్నానాల గదులు పర్యాటక శాఖ గతంలో ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు తిరునాళ్ల సందర్భంగా రూ.4.50 లక్షలతో మరమ్మతులకు ప్రతిపాదించారు. పనులు పూర్తయినా ప్రారంభించకపోవడంతో భక్తులకు ఉపయోగపడటం లేదు. చలపతినాయుని సత్రం మహిళలు, పురుషులకు పదేసి చొప్పున స్నానాలు, మరుగుదొడ్లు ఉన్నాయి. భక్తుల రద్దీ ఉండే శని, ఆదివారాల్లో అవి చాలటంలేదు. సామాన్య మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు సత్రంలో నిర్మించిన రేకులషెడ్డు నిర్వహణ లేక వినియోగించుకునేందుకు ఇష్టపడటం లేదు.
వాహనాలు ఎక్కడ నిలపాలి?
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. పార్కింగ్ నిర్వహణకు ఏటా రూ.12.32 లక్షల ఆదాయం ఉంది. ఇందుకు టి.టి.డి. కల్యాణ మండలం, ఉద్యానవన ఖాళీస్థలం, చలపతినాయుని సత్రంలో స్థలం ఉన్నా పార్కింగ్ ఇష్టారాజ్యానికి వదిలేశారు. వాహన దారుల నుంచి ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.40, బస్సులకు రూ.60 చొప్పున వసూలుకు నిర్ణయించారు. అయితే అందుకు సరైన స్థలమే కరవైంది. దీంతో భక్తులు చలపతినాయుని సత్రం, కోనేరు ప్రాంతంలోని రోడ్డులోని కాలిబాటపైనే నిలుపుతున్నారు. ఫలితంగా చోదకులు పోలీసులు ఆక్షేపణ, చీవాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అపరాధమూ చెల్లించాల్సి వస్తోంది. పార్కింగ్ రుసుం చెల్లించినా కష్టాలు తప్పలేదని వాహనాలతో వచ్చిన భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవాలయం వీధిలోకి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో రాకపోకలకు కష్టాలతో అవస్థల దర్శనం తప్పలేదని భక్తులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!