పేదల భూముల కోసం నిర్విరామ పోరాటం
భూస్వాముల ఆక్రమణలో ఉన్న పేదల భూముల కోసం తమ పోరాటం ఆగదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు తెలిపారు.
ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులు
పలమనేరు, న్యూస్టుడే: భూస్వాముల ఆక్రమణలో ఉన్న పేదల భూముల కోసం తమ పోరాటం ఆగదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమీపంలో భూ సమస్యలపై సదస్సు నిర్వహించారు. అనేకమంది మంత్రులు, మేధావులు ఉన్న చిత్తూరు జిల్లాలో పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఎస్ఈజడ్ పారిశ్రామీకరణ, నేషనల్ హైవే పేరుతో దళితుల భూములను లాక్కుని నష్టపరిహారం ఇవ్వకుండా వారికి ఎలాంటి పునరావాసం కల్పించలేదన్నారు. ఆర్డీవోకు తాము నివేదికను ఇస్తున్నామన్నారు. జగనన్న కాలనీకి ఎక్కువ భాగం దళితుల భూములే తీసుకోవడమే కాకుండా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా చేసిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ జెండాలతో నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హంగేరి ఓబుల్రాజు, ఈశ్వర్, సీఐటీయూ నాయకులు గిరిధరగుప్తా, భువనేశ్వరి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Politics News
Nellore: వైకాపాలో మరో అసంతృప్త గళం.. పరిశీలకుడిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?
-
Politics News
Sajjala: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వాయిస్ రికార్డు అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు: సజ్జల