నాడు-నేడు.. ఇక ఏనాడో?
ఐతేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు నేడు కింద రూ.1.36 కోట్లతో పనులు ప్రారంభించారు. 45 శాతం పనులే జరిగాయి. గదుల నిర్మాణం పూర్తికాలేదు.
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
పనులు చేసేందుకు గుత్తేదారుల వెనకడుగు
ఐతేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు నేడు కింద రూ.1.36 కోట్లతో పనులు ప్రారంభించారు. 45 శాతం పనులే జరిగాయి. గదుల నిర్మాణం పూర్తికాలేదు.
విద్య, వైద్యం.. ఈ రెండూ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతాయి.. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.. వీటి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం...
ఇదీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిత్యం వల్లెవేసే మాటలు..
ఇవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. నాడు-నేడు కింద చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గుత్తేదారులకు నిధులు చెల్లించకపోవడంతో వారు పనులు నిలిపివేశారు.
ఏర్పేడు మండలం బండారుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు నిధుల కింద శ్లాబ్ వరకే పనులు జరిగాయి. నిధులు విడుదల చేయకపోవడంతో పక్కనపెట్టారు.
రేణిగుంట గ్రామ సచివాలయం-3 భవనాన్ని శ్లాబు వరకు నిర్మించారు. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
సూళ్లూరుపేట పరిధిలోని మన్నారుపోలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.1.60 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రూ.70 లక్షలు విడుదల చేశారు. తర్వాత మరో రూ.15 లక్షలు ఇచ్చారు. పది గదులు నిర్మించేందుకు ప్రతిపాదించినా ఎనిమిదే నిర్మించారు. వాటినీ పూర్తిస్థాయిలో చేయలేదు. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు.
ఈనాడు-తిరుపతి: జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. గొప్పల కోసం పనులు ప్రారంభించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. సొమ్ము చెల్లిస్తేనే పనులు పూర్తి చేస్తామంటూ గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు.
పనులు అప్పగించిన తర్వాత గుత్తేదారులు తొలుత బాగానే చేశారు. వారు బిల్లులు పెట్టడంతో మంజూరు నిలిపివేశారు. అదేమని అడిగితే పనులు పూర్తి చేసిన తర్వాతే చెల్లిస్తామంటూ అధికారుల సమాధానం రావడంతో వారు కంగుతిన్నారు. సిమెంటుకు కూడా నిధులు మంజూరు చేయకపోడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. అటు పాఠశాలల దగ్గర నుంచి ఇటు ఆర్బీకేలు, గ్రామ సచివాలయ పనులన్నీ ఆగిపోయాయి.
అప్పులు చేసి..
పనులు చేస్తే ఎంతో కొంత మిగులుతుందని భావించిన కొందరు గుత్తేదారులు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా అప్పులు చేసి కొనసాగించారు. ప్రభుత్వం తమను విస్మరించడంతో అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇసుకతోపాటు కూలీల ధరలు పెరిగాయని, పనులు చేయడం కష్టమని చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వంతో పనులు చేసినా అప్పులపాలు కావాల్సిందేనని వాపోతున్నారు. మొత్తంగా చూస్తే వైకాపా ప్రభుత్వం కేవలం ప్రగల్భాలు పలకడం తప్ప క్షేత్రస్థాయిలో చేస్తున్నది ఏమీ లేదని పలువురు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరి కొన్ని గంటల్లో పోలింగ్ .. తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర
[ 12-05-2024]
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల సాత్తుమొర జరిగింది. ఈ ఉత్సవం మే 3 నుంచి 21వ తేదీ వరకు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరగనుంది. -
ఎర్రచందనం దొంగకు ఓటేస్తే.. ఏమీ మిగలదు
[ 12-05-2024]
నాకు జన్మనిచ్చి రాజకీయ ఓనమాలు నేర్పిన చిత్తూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిని చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన మురకంబట్టు కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. -
జగన్ చిమ్మిన విషం.. పట్టణాలకు శాపం
[ 12-05-2024]
ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులను వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసే నగరపాలక, పురపాలక సంఘాలు.. ప్రజలకు కనీస సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయి.. -
ఆవిష్కరణలకు ఉరి.. యువతకేదీ దారి
[ 12-05-2024]
చదువు లేకున్నా అనేకమంది తమ ప్రతిభతో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తున్నారు. ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నా వారి ప్రతిభను గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పే వేదిక కావాలి. -
ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వాలంటీర్
[ 12-05-2024]
నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నగదు పంపిణీకి తెరలేపింది. నాయకులు బహిరంగంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ నాయకులతో కలిసి నగదు పంపిణీలో వాలంటీర్ పాల్గొన్న ఘటన మండలంలో శనివారం చోటుచేసు కుంది. -
ప్రచారంలో పాల్గొన్నాడని.. పింఛను ఆపేశారు
[ 12-05-2024]
మండల పరిధి నడింపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త క్రిష్ణప్పకు అందుతున్న సామాజిక పింఛను సాయాన్ని వైకాపా ఒత్తిళ్లతో అధికారులు నిలుపుదల చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం ఆరోపించారు. -
జగనన్న పాలనలో.. ఉద్యానానికి వట్టి చేతులే
[ 12-05-2024]
ఉద్యాన సేద్యానికి పేరుగాంచిన కుప్పం రైతులకు జగన్ ప్రభుత్వం నుంచి ఒరిగిన ప్రయోజనం శూన్యమే. నాలుగు మండలాల్లో వేల మంది రైతన్నలు లక్షల ఎకరాల్లో పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. -
‘నారాయణస్వామీ.. నిన్ను జైల్లో పెడతా’
[ 12-05-2024]
నారాయణస్వామీ నువ్వు ఎన్ని.. సారా దస్త్ల్రాల్లో సంతకాలు పెట్టావో మాకు తెలుసు అధికారంలోకి వచ్చాక నిన్ను జైల్లో కూర్చోబెడతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఛార్జీల మోతాదు పెంచిన జగన్
[ 12-05-2024]
‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అనేది.. శ్రీమంతుడులో మహేష్బాబు డైలాగ్. ప్రజలకు సంక్షేమం ఇచ్చాం.. అలాగే ప్రజలూ ప్రభుత్వానికి ఛార్జీల రూపంలో రెండింతలుగా ఇచ్చేయాలి అన్నది సీఎం జగన్ -
కూటమితో తిరుపతి ముఖచిత్రం మారుతుంది
[ 12-05-2024]
ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిని మోదీ ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా 50వేల మందికి ఇక్కడ ఉపాధి లభించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. -
కలగానే సాఫీ ప్రయాణం
[ 12-05-2024]
రహదారులే అభివృద్ధికి ప్రతీకలు. ఇది ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా తెలుస్తుంది. రాష్ట్రంలోని రహదారుల నిర్వహణకు పైసలు విదల్చని జగన్ సర్కార్ అంతర్రాష్ట్ర దారులను పట్టించుకోలేదు. -
వైకాపా కవ్వింపు చర్యలు
[ 12-05-2024]
భాకరాపేటలో శనివారం వైకాపా మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి పులివర్తి నాని ముగింపు ప్రచారంలో భాగంగా భాకరాపేటలోని గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. -
సమానత్వమేడ జగన్!
[ 12-05-2024]
‘నాణ్యత లేని నిర్మాణాలు.. కనీసం పునాదులు కూడా లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. గట్టిగా గాలి వీస్తే కూలిపోయే ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ మాత్రం సరిపోవట్లేదు. అందువల్ల పనులు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం’
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!