logo

కుప్పంలో వైకాపా హైడ్రామా..?

వైకాపా అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా  అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా.

Published : 28 Apr 2024 03:04 IST

కోడ్‌ అమలులో ఉన్నా సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

యమనాసనపల్లి గ్రామంలో కొత్తగా వేసిన పైపులైను

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా  అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా.. వారం వ్యవధిలో ఆ ప్రాంతంలో తాగునీటి పైపులైను వేశారు.  కుప్పం మండలం యమనాసనపల్లికి చెందిన వెంకటాచలం ఆధ్వర్యంలో కొందరు గ్రామస్థులు ఏప్రిల్‌ 21న ఎమ్మెల్సీ భరత్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ భరత్‌ ఆఘమేఘాలపై శనివారం పైపులెన్లు ఏర్పాటు చేయించారు. పలుచోట్ల సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. వారం కిందట జరుగు గ్రామంలో హంద్రీ-నీవా కాలువ వద్ద రోడ్డు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు