మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి.
కార్డుదారులకు అరకొరగా చక్కెర
పేదలపై అదనపు భారం మోపిన జగన్ సర్కారు
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు) : పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని రకాల సరకులకు కోత పెట్టి.. ఒక్క బియ్యం పంపిణీకి పరిమితమవుతోంది.. ప్రతి నెలా అందరికీ తీపి పంచాల్సిన చక్కెరను అరకొరగా అందజేసి చేదు మిగల్చడం జగనన్న పాలన ప్రత్యేకం.. తెదేపా పాలనలో కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేశారు.. వైకాపా అధికారంలోకి రాగానే వాటన్నిటిలో కోత పెట్టి తాజాగా పూర్తిగా నిలిపేశారు.. ఓవైపు బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి.. మరోవైపు ప్రభుత్వం రాయితీపై అందించే సరకులు సైతం అందక సామాన్యులు బతుకుబండి నెట్టుకొచ్చేందుకు అల్లాడిపోతున్నారు.
తెదేపా పాలనలో..
2014-19 వరకు తెదేపా పాలనలో చౌకధరల దుకాణాల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి తదితర సరకులు అందజేశారు. దీపావళి, ఉగాది, వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్ పర్వదినాల్లో అదనపు సరకులతో పాటు చక్కెర అదనంగా పంపిణీ చేశారు.
వైకాపా ప్రభుత్వం వచ్చాక..
పండగలకు అందజేసే అదనపు చక్కెర, సరకుల పంపిణీ పూర్తిగా ఆపేశారు. లబ్ధిదారులకు ఇచ్చే అర కిలో రూ.17 చక్కెరను అరకొరగా అందజేస్తున్నారు. కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో కార్డుదారులకు ఇది అందడం లేదు.
ప్రస్తుత పరిస్థితి..
బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.43-45గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా నిలిపివేయడంతో ప్రతి కార్డుదారుడిపై అర కిలో చక్కెరపై రూ.5.50 పైసలు అదనపు భారం పడుతోంది.
అస్తవ్యస్తంగా పంపిణీ..
ఇంటింటికీ బియ్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తున్నా పంపిణీ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఎండీయూ వాహనం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చక్కెర ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. తెదేపా ప్రభుత్వం పండుగలకు అదనంగా చక్కెర ఇచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని ఆరోపిస్తున్నారు. వైకాపా పాలనలో తీపి కరవైందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- జిల్లాలో బియ్యం కార్డులు: 5,43,202
- చౌక దుకాణాలు: 1,379
- ఎండీయూ వాహనాలు: 336
దర్జాగా ఎగ్గొట్టేశారు..
జిల్లా వ్యాప్తంగా 5.43లక్షల కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం సక్రమంగా చక్కెర సరఫరా చేయడం లేదు. 15 నెలలుగా జిల్లాకు 2,518 టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా.. 2,064 టన్నులు మాత్రమే అందజేశారు. మిగిలిన 447 టన్నులతో పాటు అదనపు కోటా ఎగ్గొట్టేశారు. దీంతో లబ్ధిదారులకు రాయితీపై సరకు అందకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలతో ఆర్థిక భారం తప్పడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పంపిణీతో ఐదేళ్లలో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మిగుల్చుకుంది. ఈ మొత్తాన్ని పేదలపై ఆర్థిక భారాన్ని మోపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటెత్తిన చైతన్యం
[ 15-05-2024]
జిల్లా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో రికార్డు స్థాయిలో 85.63% ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 83.25, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 82.92 శాతం నమోదైంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రం
[ 15-05-2024]
చిత్తూరు లోక్సభతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను చిత్తూరు నగరం ఎస్వీసెట్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
పల్లె ఓటర్లు పోటెత్తారు!
[ 15-05-2024]
పల్లె ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచారు. -
అంతరాలయంపై ఆలస్యమేల..!
[ 15-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
ప్రచారం చేసినందుకు పంటకు నిప్పు
[ 15-05-2024]
మండలంలోని బూరుగుమాకులపల్లిలో రామేగౌడు ఇటీవల తెదేపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆరునెలల ముందు తెదేపా నుంచి వైకాపాలో చేరారు. -
విదేశాలకు మామిడి ఎగుమతులు
[ 15-05-2024]
అందరినీ నోరూరించే మామిడి సీజన్ ప్రారంభమైంది. జిల్లా నుంచి మామిడి కాయల ఎగుమతులు విదేశాలకు ప్రారంభమయ్యాయి. -
సర్పంచి ఇంటిపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
మండలంలోని జగన్నాధపురం సర్పంచి రాణెమ్మ(ఇటీవల ఎన్నికలకు ముందు తెదేపాలో చేరారు) ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. -
భార్యపై కత్తితో దాడి .. పరిస్థితి విషమం
[ 15-05-2024]
భార్యపై భర్త కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలోని లక్ష్మయ్యకండ్రిగ బస్సు స్టాప్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. -
పాశవికం..!
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిని హతమార్చేందుకు వైకాపా గూండాలు మంగళవారం బరితెగించారు. శ్రీపద్మావతి వర్సిటీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్దకు వచ్చిన నానిని అంతమొందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచరులు యత్నించారు. -
తిరుపతి గంగజాతరకు చాటింపు
[ 15-05-2024]
తిరుపతి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. -
వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు
[ 15-05-2024]
వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. -
మాదే గెలుపు.. పందెమెంతో చెప్పు
[ 15-05-2024]
జిల్లాలో బెట్టింగుల జోరు ఎక్కువే. ఐపీఎల్ సీజన్లో జోరుగా బెట్టింగులు జరుగుతాయి. ఈ బెట్టింగులు ఒక వైపు ఉంటే.. -
నానిపై దాడి అమానుషం
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి అమానుషమని తెదేపా కూటమి ఎంపీ,
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు