వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు
వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు.
రోడ్డెక్కుతున్న గ్రామీణ జనం
ముందు చూపులేని పాలకులు
శాశ్వత నీటి పథకాలకు గ్రహణం
గూడూరు, న్యూస్టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. దీంతో వేసవిలో మోటార్లు కాలిపోయినా పట్టించుకునే వారు కరవయ్యారు.
జిల్లాలోని 970 గ్రామాల్లో పీడబ్ల్యూఎస్ 3,194, బోర్వెల్స్ 5,894 వరకు ఉన్నాయి. వీటి ద్వారా సరిపడా నీటి సరఫరా చేయడంలేదు. ఇవి తాత్కాలిక పథకాలు కాగా.. వేసవి ముందే బోర్లు అడుగంటి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కువ గ్రామాల్లో ఉన్న చేతి బోర్లు దెబ్బతిని మూలన చేరాయి. తీర ప్రాంతాల్లోని వాకాడు, చిల్లకూరు, కోట, తడ తదితర గ్రామాల్లో ఇంకా శాశ్వత నీటి పథకాలు అందుబాటులోకి రాలేదు.
నందిమాలో నీరు అందించని ట్యాంకు
బోరు బావులే దిక్కు.. కేవీబీపురం మండలం కండ్లూరు గ్రామంలో తాగునీటి సరఫరా చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఇటీవల నీటి పథకం మంజూరు చేసినా ఆ నీటిని తాగలేని ఇక్కడ వారంతా పంట పొలాల్లోని బోరు బావుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. వేసవిలో ఆ బోర్లు వేసే పరిస్థితి లేక కొనాల్సి వస్తోంది. ఏటా ఇదే తీరుగా నీటి కోసం జనం అల్లాడుతున్నారు.
విన్నవించినా పట్టించుకోరు.. చిట్టమూరు మండలం మల్లాం ఎస్సీ కాలనీలో నీటి కోసం జనం రోడ్డెక్కారు. ఇక్కడ శాశ్వత నీటి పథకాలు మంజూరు చేయక, ఉన్న బోర్లు బాగు చేయకపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక్కడ ఎస్సీ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇటీవల రోడ్డుపై బైఠాయించారు.
ట్యాంకర్లతో అందిస్తూ.. పెళ్లకూరు మండలం ఆర్లపాడు ఎస్సీ కాలనీలో తాగునీటి ఇబ్బందులున్నాయి. పథకం తరచూ మొరాయిస్తోంది. ఇక్కడికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అర్ధమాల ఓహెచ్ఆర్కి అనుసంధానంగా జల్జీవన్ ద్వారా గొట్టపు మార్గం, బోరు ఇటీవల వేయించారు. వేసిన బోరు ట్యాంకుకి దూరం కావడంతో నీరు ఎక్కే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ నీటికి జనం అల్లాడుతున్నారు. రూ.25 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకం నిరుపయోగంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షర కిరణాలు.. సేవా పరిమళాలు
[ 10-06-2024]
‘ఈనాడు’ అక్షర కిరణాలు.. చీకట్లు పారదోలాయి.. లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాయి.. నిత్యం ఉషోదయానే ఇంటింటినీ పలకరిస్తూ తెలుగుజాతిని జాగృతం చేశాయి. -
అక్షరశిల్పికి పుష్పాంజలి
[ 10-06-2024]
ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాపసభ తిరుపతి ప్రెస్క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. -
ఆక్రమణలకు అడ్డుగోడలా నిలిచి..
[ 10-06-2024]
బైరెడ్డిపల్లెలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధాన రహదారి పక్కన భూములు ఎకరం రూ.కోటి పైమాటే. కబ్జా చేసి పాగా వేయాలని అక్రమార్కులు యత్నించారు. -
గదులకు రూ.కోటి నిధులు
[ 10-06-2024]
మూలతిమ్మేపల్లె జడ్పీఉన్నత పాఠశాలలో గదుల కొరతతో గతంలో విద్యార్థులు చెట్లనీడలో చదువులు సాగించాల్సిన పరిస్థితి. ఇది విలీన బడి. ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకూ మూడు గదులే ఉన్నాయి. -
నత్తలు నవ్వుతున్నాయ్..!
[ 10-06-2024]
ఆర్భాటంగా నాడు-నేడు పనులు చేపట్టిన గడువు లోగా పూర్తి కాకపోవడంతో నవ్వులపాలు కావాల్సిన పరిస్థితి. నిర్మాణాల్లో వేగం పెంచినపుడు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పనులు నిలిచిపోతున్నాయి. -
జడ్పీ పూర్వ సీఈవోపై విచారణ..!
[ 10-06-2024]
నిధుల దుర్వినియోగం, జడ్పీ ఉద్యోగులను తీవ్రంగా వేధించారనే పలువురు తెదేపా నాయకుల ఆరోపణల నేపథ్యంలో జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిపై.. విచారణకు జిల్లా ఉన్నతాధికారులు అంగీకరించారు. -
పుత్తూరులో డయేరియా రక్కసి
[ 10-06-2024]
పుత్తూరు పురపాలిక పరిధిలోని నందిమంగళం దళితవాడలో డయేరియా ప్రాణాలు తీస్తోంది. గ్రామస్థుల కథనం మేరకు.. నందిమంగళంలో కొద్దిరోజులుగా కలుషిత నీటి సరఫరాతో పలువురు ఆస్పత్రి పాలవుతున్నారు. -
సామాన్యుల హృదయాల్లో సుస్థిరస్థానం
[ 10-06-2024]
ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ డాక్టర్ రామోజీరావు మృతి యావత్ తెలుగు జాతికే తీరని లోటని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య గౌరవాధ్యక్షులు మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. -
రహదారి ప్రమాదంలో బాలుడి దుర్మరణం
[ 10-06-2024]
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో కేజీసత్రం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడుమృతి చెందగా, దంపతులకు గాయాలయ్యాయి. -
సిలికాసురుల్లో.. గుబులు
[ 10-06-2024]
సిలికా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లీజుదారులను భయపెట్టి అనుమతికి మించి తవ్వకాలు చేపట్టిన వైకాపా కీలక నేతల్లో ఆందోళన మొదలైంది. -
16 శ్రీవారి సర్వదర్శనానికి గంటలు
[ 10-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
రామోజీరావు సేవలు అజరామరం
[ 10-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ప్రజాపక్షపాతి అని, వారి సమస్యల పరిష్కారానికి, వారి అభిప్రాయాలకు అద్దంపట్టిన అక్షర యోధుడు రామోజీరావు అని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. -
విజేఈఈభవ
[ 10-06-2024]
ఆదివారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులతో మెరిశారు. ఈ సందర్భంగా వారి మనోగతాన్ని ‘న్యూస్టుడే’తో పంచుకున్నారు. -
గల్లంతయ్యారు..!
[ 10-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులకు తప్ప పోటీలోని మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంత య్యాయి.