అమ్మా.. నాన్నేడని అడిగితే చెప్పేదెలా..: భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో గర్భిణి
మొదటి సంతానంతో ముచ్చటగా గడుపుతున్న ఆ దంపతులు మరో బిడ్డ తమ జీవితాల్లోకి రానున్న ఆనందంలో ఉన్నారు. రెక్కల కష్టంతో ఉన్నంతలో ఉన్నతంగా జీవనం గడుపుతున్నారు.
సత్యనారాయణ (పాత చిత్రం)
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: మొదటి సంతానంతో ముచ్చటగా గడుపుతున్న ఆ దంపతులు మరో బిడ్డ తమ జీవితాల్లోకి రానున్న ఆనందంలో ఉన్నారు. రెక్కల కష్టంతో ఉన్నంతలో ఉన్నతంగా జీవనం గడుపుతున్నారు. పుట్టబోయే పాప, బాబు ఎవరైనా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని వైద్య పరీక్షలు చేయించుకునేందుకు బయలుదేరారు. అప్పటివరకు ఎన్నో ఊసులతో సాగుతున్న వారి ప్రయాణంలో అనుకోని ఘటన తీరనివిషాదం నింపింది. భార్యను ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో భర్త మృతిచెందగా, కుమారుడికి తీవ్రగాయాలు కాగా, భార్యకు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం చిక్కాలకు చెందిన చిటికెన కోట సత్యనారాయణ(36) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య భవాని గర్భిణి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై శనివారం రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్కం రైలు వంతెన సమీపంలోని పెట్రోలు బంకు దగ్గరకు వచ్చేసరికి అపమార్గం (రాంగ్ రూట్)లో వచ్చిన ట్రాక్టరు ఢీకొంది. దీంతో సత్యనారాయణకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యనారాయణ అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందారు. చిన్నారి తలకు గాయం కాగా చికిత్స పొందుతుండగా భవాని స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడి బావ కాసాని శ్రీనివాస్ ఫిర్యాదుపై పట్టణ ఎస్సై భూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ ఆధారాన్ని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
కల్వర్టును ఢీకొట్టి మృతి
గోపాలపురం, న్యూస్టుడే: ద్విచక్రవాహనం నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై కె.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీపేటకు చెందిన కట్టవ సత్యనారాయణ(60) ఇటీవల తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలలోని ఆయన కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి బయలు దేరాడు. గోపాలపురం మండలంలోని దేవరపల్లి రహదారిలోని పొగాకు బోర్డు సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు కె.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళల మృతి
[ 12-05-2024]
గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతిచెందారు. -
మీ ఓటు అభివృద్ధికా.. అరాచకానికా?
[ 12-05-2024]
సహజ సంపదకు నిలువెత్తు ఠీవిలా కనిపించే గిరులకు బోడిగుండు కొట్టేశారు.. యువతకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా ఉస్సూరనిపించారు.. -
మీ కోపం ఓట్ల రూపంలో చూపండి
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రం కాకినాడలోని బాలాజీ చెరువు కూడలిలో ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. -
పట్టించుకోని ప్రభుత్వం.. పడకేసిన పథకం
[ 12-05-2024]
కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. అలా ఉత్పత్తి చేసేందుకు నీరు ఉపయోగించేవారు. -
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
[ 12-05-2024]
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించారు. -
ఓటేసేందుకు సొంతూళ్లకు..
[ 12-05-2024]
విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలివస్తున్నారు. -
బాధ్యత మరిచి.. భారం మోపి
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాలు మోపింది. సంక్షేమ పాలన పేరుతో గొప్పులు చెబుతూనే పథకాలను ఆశచూపి కొందరికే వాటిని అర్హులను చేసింది. ఇచ్చేది గోరంత.. -
జగనన్నా.. ఇదేనా ఆహ్లాదం
[ 12-05-2024]
వి.ఎల్.పురంలోని తెలుకులవారి చెరువు పార్కు లోపల కొన్ని విద్యుత్తు ల్యాంపులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని దీపాలు సరిగా వెలగడం లేదు. -
అయిదేళ్ల అధికారం.. అంతటా అంధకారం
[ 12-05-2024]
పండించిన పంటకు పెట్టుబడి కూడా దక్కక రైతన్న కన్నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత.. -
ష్.. గప్చుప్
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. -
కట్టలు పంచి.. మత్తున ముంచి
[ 12-05-2024]
మైకుల హడావిడి లేదు.. ప్రచార హోరు లేదు.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ఎక్కడివక్కడ గప్చుప్. తెరవెనుక రాజకీయం మొదలైంది..
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు