ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన.
పొట్టిలంకపై అన్నీ వట్టిమాటలే!
ఇదీ దత్తత గ్రామంలో అభివృద్ధి తీరు
న్యూస్టుడే, కడియం
వారధి నిర్మాణానికి వేసిన శిలాఫలకం
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. అవన్నీ వట్టి మాటలేనని, పనులు మాత్రం ముందుకు సాగలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయలేదనే అధికార పార్టీ నాయకులు అభివృద్ధి ఆపేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పొట్టిలంక గ్రామంలో తూర్పు డెల్టా కాలువ పైవంతెన నిర్మాణం దీర్ఘకాలిక సమస్యగా మిగిలిపోయింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వారధి నిర్మాణానికి ముచ్చటగా మూడుసార్లు శంకుస్థాపన పేరిట నాయకులు హడావుడి చేశారు. నియోజకవర్గ అప్పటి సమన్వయకర్త చందన నాగేశ్వర్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ ఆధ్వర్యంలో మూడుసార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి పత్రాలతో వచ్చారు. రూ.4.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఒకసారి.. అది కాస్తా రూ.5 కోట్లకు చేరిందని మరోసారి అన్నారు. తర్వాత ఎవరికి వారే రావడం ఇదిగో వంతెన.. అదిగో వంతెన అంటూ చెప్పడమే తప్ప పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు కదల్లేదు.
పొట్టిలంకలో నిరుపయోగంగా తాగునీటి ట్యాంకు
కలగానే ఇంటింటికీ తాగునీరు
గ్రామంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఇంటింటికీ కొళాయి వచ్చేస్తుందన్నారు. దాంతో తమ కష్టాలు తీరాయని మహిళలు అనుకునేలోపే పనులు నిలిచాయి. ప్రస్తుతం ఓ ట్యాంకు నుంచి మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. నిర్మాణాలు పూరైన మరో రెండు ట్యాంకులకు పైపులైన్ల కనెక్షన్ ఇవ్వకపోవడంతో అవి నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి.
ఓట్లు వేయలేదంటూ పనులు ఆపేశారు..
గ్రామంలో మురుగు సమస్య నివారణకు కాలువ నిర్మాణం తలపెట్టారు. కొంతమేర పనులు ముందుకు సాగాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఎంపీటీసీగా జనసేన పార్టీకి చెందిన అభ్యర్థిని విజయం సాధించారు. దాంతో ఆ ప్రాంతంలోని వారంతా వైకాపాకు ఓట్లు వేయలేదని కాలువ పనులు నిలిపేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇసుకను వేసి తాత్కాలికంగా మూసి ఉంచారు.
సీఎంకు వినతులిచ్చినా ఫలితం లేదు..
గ్రామంలో దాదాపు 550 మంది రైతులున్నాం. వ్యవసాయం, నర్సరీలు, పలు రకాల పూలతోటలు పెంచుతూ.. జీవనోపాధి పొందుతున్నాం. పనుల నిమిత్తం ప్రతి రోజూ కాలువ పైనుంచి అవతలి వైపు వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఉన్న కాలిబాట వంతెనతో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. వారధి కోసం ఏళ్ల తరబడి పలువురు నేతలకు వినతులు ఇచ్చినా.. అనుమతులు తప్పా పనులు ముందుకు సాగలేదు. ఇటీవల బస్సుయాత్రకు విచ్చేసిన సీఎంకు వినతిని అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన స్పందించకపోవడంతో రైతులంతా నిరాశ చెందారు. చేతికొచ్చిన పంట తరలింపు రవాణా భారంగా మారి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
కొత్తపల్లి రాజాబాబు, రైతు, పొట్టిలంక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
[ 15-05-2024]
ఆన్లైన్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు వెతుక్కుని జనాల నుంచి రూ.లక్షలు దోచేస్తున్నారు. మొదట్లో ఈకేవైసీ, ఆధార్ లింక్ పేరిట మోసాలు జరిగేవి. తర్వాత కొన్నాళ్లకు ఆన్లైన్లో లాటరీ, రుణాలు, వస్తువులు విక్రయాలు.. రెట్టింపు నగదు.. ప్రభుత్వ పథకాలు.. వర్క్ ఫ్రం హోమ్ వంటి వాటితో మస్కా కొట్టేవారు. -
39,09,908 ఇది ఓటేసిన వారి సంఖ్య
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. యువత, పెద్దలు స్ఫూర్తి రగిలించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 77.42 శాతం పోలింగ్ నమోదుకాగా.. 2019 ఎన్నికల్లో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయ్యింది. -
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
[ 15-05-2024]
ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. -
చీకట్లను చీల్చేలా ఓటరు తీర్పు
[ 15-05-2024]
ఎండలు మండుతున్నా తగ్గలేదు.. చీకట్లు కమ్మినా చెక్కుచెదరలేదు. అర్థరాత్రి వరకు పాశుపతాస్త్రం సంధించేందుకు లైనులో నిలబడి విలువైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
తిరిగెళ్తున్నారు..
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని సొంతూళ్లకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో మంగళవారం ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు రద్దీగా నడిచాయి. -
లంకల్లో హామీలు.. నీటి మీద రాతలు
[ 15-05-2024]
గోదావరి ఎడమ గట్టున లంక గ్రామాలకు రక్షణ కల్పిస్తామని, నదీతీరం కోత బారి నుంచి తప్పిస్తామని పాలకులు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. రెండేళ్ల క్రితం వరసగా మూడుసార్లు వచ్చిన వరదలతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటూనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజుల తరబడి గడిపాయి. -
పారితోషికంలో వ్యత్యాసంపై పోలింగ్ సిబ్బంది ఆందోళన
[ 15-05-2024]
పక్క జిల్లాలతో పోలిస్తే తమకు చెల్లించిన పారితోషికంలో వ్యత్యాసం ఉండటంపై జిల్లాకు చెందిన పలువురు పోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిబంధనలకు పాతర.. ప్రమాదాలకు చేరువ
[ 15-05-2024]
ముంబయిలో భారీ హోర్డింగ్ కూలిపోవడంతో సుమారు 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంలో కూడా పలుచోట్ల భారీ హోర్డింగ్లు ప్రమాదకరంగా మారాయి. -
మండపేట జనసేన నేతపై హత్యాయత్నం కేసు
[ 15-05-2024]
వైకాపా నేతల ఫిర్యాదుతో పోలీసులు ఏకపక్షంగా మండపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త లీలకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. -
కూలిన ఆశలు
[ 15-05-2024]
బిడ్డలకు చక్కటి భవితనివ్వాలని కాయకష్టాన్ని నమ్ముకున్న జీవులు వారంతా.. అమాంతం మృత్యు శకటం మీదపడి నలుగురి జీవితాలను చిదిమేసింది. మరో గంటకో.. ఘడియకో ఇల్లు చేరాల్సిన వారి ప్రయాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. -
తెదేపా శ్రేణులపై వైకాపా మూకదాడి
[ 15-05-2024]
ఎన్నికలు ముగిసినా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆత్రేయపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా వర్గానికి చెందిన వేగేశ్న గోపిరాజు మంగళవారం సామాజిక మాధ్యమంలో అభ్యంతకర పోస్టు పెట్టారు. -
నిధులు మళ్లించి.. పల్లెను ముంచి
[ 15-05-2024]
గ్రామ స్వరాజ్యానికి పట్టుకొమ్మలైన పల్లెలను అయిదేళ్ల పాలనలో వైకాపా పూర్తిగా విస్మరించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల్వికపోవడంతో రోడ్లు, డ్రెయిన్లు, వివిధ భవన నిర్మాణాలు చేపట్టలేకపోయారు. -
పోలింగ్పై పార్టీల పంచనామా..
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. ఓటరు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ నాలుగో తేదీ వరకు ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందనేది అధికారికంగా నిర్ధారణ కాదు. ఎన్నికల పోలింగ్ ఏవిధంగా జరిగింది.. -
ముందుగా ఓటేయాలని గొడవ.. యువకుడి అపహరణ
[ 15-05-2024]
మలికిపురం మండలంలో రామరాజులంక గ్రామానికి చెందిన రేకపల్లి నాగరాజు అనే యువకుడు కిడ్నాప్కు గురై సుమరు 10 గంటల అనంతరం సురక్షితంగా విడుదలైన ఘటన సంచలనమైంది. -
లెక్కలు పక్కాగా చూపకపోతే చిక్కులే..
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యేవరకు అయిన ఎన్నికల ఖర్చును అభ్యర్థులు పక్కాగా చూపాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
బహిరంగ క్షమాపణలు కోరిన మెహరీన్.. ఎందుకంటే!
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్