మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు.
వైకాపా నేతలు సహజవనరులను దోచేశారు
జగన్ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేనాని పవన్
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం- న్యూస్టుడే, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, కిర్లంపూడి, జగ్గంపేట, జగ్గంపేట రూరల్
సభలో నమస్కరిస్తున్న పవన్, ఉదయ్శ్రీనివాస్, సత్యప్రభ
వైకాపాకు ఎందుకు ఓటెయ్యాలి..?
దళితులను డోర్ డెలివరీ చేసినందుకా?
కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినందుకా.?
భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టినందుకా?
తాగు-సాగునీటి కష్టాలు మిగిల్చినందుకా?
కొండలు మింగేసి వాటాలు పంచుకున్నందుకా..?
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్న
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వరు.. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 24 శాతం చేసి అన్యాయం చేశారు. ఈబీసీ 5 శాతం కూడా తీసేశారు. వైకాపాకు ఎందుకు నిలబడాలని పవన్ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు.
కూటమి జట్టుగా: జగ్గంపేట అభ్యర్థి నెహ్రూతో పవన్
తట్టుకునే ధైర్యం మీలో ఉంది..
జగన్ గూండా ప్రభుత్వాన్ని తట్టుకునే దమ్ము, ధైర్యం, తెగింపు జనసేనకు, జనసైనికులకు ఉందని పవన్కల్యాణ్ అన్నారు. నేను మీకు మాట ఇస్తున్నా.. ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రత్తిపాడులో అడుగుపెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. నాకు దండాలు కావు.. మీ భవిష్యత్తు కావాలి..ఈ దేశ సమగ్ర సంకల్పం.. ఆంధ్రరాష్ట్ర సంకల్పం మీ గొంతే.. నేను మీ గొంతునవుతా..అని పవన్ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు యువకులకు చెబుతున్నా.. చలమలశెట్టి సునీల్, ఇక్కడి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు కోసం వస్తే.. భవన నిర్మాణ కార్మికుల బతుకుపై దెబ్బతికొట్టిన మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి.. దళితుడిని చంపినవారిని ఎందుకు వెనకేసుకు తిరుగుతున్నావని అడగండి..రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికుల పొట్ట కొట్టకూడదన్నా.. కూటమికి ఓటెయ్యాలని కోరారు.
మైనింగ్ అడ్డాగా మార్చేశారు
‘ప్రత్తిపాడును మైనింగ్కు అడ్డాగా చేశారే తప్ప.. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు, సాగునీటి సమస్యల పరిష్కారానికి వైకాపా నాయకులు చొరవ చూపలేద’ని పవన్కల్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ, జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, లోక్సభ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు.
వెన్నెముక ఊడిపోయేలా రోడ్లున్నాయ్..
‘ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల సౌకర్యాలు లేవు. వెన్నెముక ఊడిపోయేలా రోడ్లు ఉన్నాయి. అలాంటివి బాగుచేయడం మానేసి వీళ్లు వంతాడ మైనింగ్ తవ్వేసి వంతెనలు వేసుకుంటున్నారు. ఆ బ్రిడ్జికి.. అనుమతి ఇచ్చిన అధికారి పేరు పెట్టుకున్నారని పవన్కల్యాణ్ ఆరోపించారు. 2019లో వంతాడ మైనింగ్ చూడడానికి వచ్చాను. దోచి మన నదీవనరులు, ఇసుక, ఖనిజాలు.. అన్నీ దోచేస్తున్నారు. యువతరానికి ఏ సంపద విడిచి పెట్టలేద’ని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.
మీ సమస్యలకు పరిష్కారం చూపుతా..
ఏలేరు జలాశయం ఆధునికీకరణ, పుష్కర- పోలవరం కాలువలపై ఎత్తిపోతలు పథకాలు నిర్మించి సాగునీరు అందించడం.. శిథిల రోడ్లు పునర్నిర్మించి ప్రజారవాణా వ్యవస్థ బాగుచేస్తామన్నారు.గిరిజన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యం అందుబాటులోకి తెస్తామన్నారు. సబ్ప్లాన్ పరిధిలోని పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలని కోరారని.. గిరిజనుల గళం అసెంబ్లీలో వినిపిస్తానన్నారు.. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని, సుబ్బారెడ్డి, చంద్రబాబు సాగర్ను ముందుకు తీసుకెళ్తామన్నారు. అన్నవరం క్షేత్రాన్ని దేశం మొత్తం చూసేలా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
39,09,908 ఇది ఓటేసిన వారి సంఖ్య
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. యువత, పెద్దలు స్ఫూర్తి రగిలించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 77.42 శాతం పోలింగ్ నమోదుకాగా.. 2019 ఎన్నికల్లో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయ్యింది. -
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
[ 15-05-2024]
ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. -
చీకట్లను చీల్చేలా ఓటరు తీర్పు
[ 15-05-2024]
ఎండలు మండుతున్నా తగ్గలేదు.. చీకట్లు కమ్మినా చెక్కుచెదరలేదు. అర్థరాత్రి వరకు పాశుపతాస్త్రం సంధించేందుకు లైనులో నిలబడి విలువైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
తిరిగెళ్తున్నారు..
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని సొంతూళ్లకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో మంగళవారం ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు రద్దీగా నడిచాయి. -
లంకల్లో హామీలు.. నీటి మీద రాతలు
[ 15-05-2024]
గోదావరి ఎడమ గట్టున లంక గ్రామాలకు రక్షణ కల్పిస్తామని, నదీతీరం కోత బారి నుంచి తప్పిస్తామని పాలకులు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. రెండేళ్ల క్రితం వరసగా మూడుసార్లు వచ్చిన వరదలతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటూనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజుల తరబడి గడిపాయి. -
పారితోషికంలో వ్యత్యాసంపై పోలింగ్ సిబ్బంది ఆందోళన
[ 15-05-2024]
పక్క జిల్లాలతో పోలిస్తే తమకు చెల్లించిన పారితోషికంలో వ్యత్యాసం ఉండటంపై జిల్లాకు చెందిన పలువురు పోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిబంధనలకు పాతర.. ప్రమాదాలకు చేరువ
[ 15-05-2024]
ముంబయిలో భారీ హోర్డింగ్ కూలిపోవడంతో సుమారు 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంలో కూడా పలుచోట్ల భారీ హోర్డింగ్లు ప్రమాదకరంగా మారాయి. -
మండపేట జనసేన నేతపై హత్యాయత్నం కేసు
[ 15-05-2024]
వైకాపా నేతల ఫిర్యాదుతో పోలీసులు ఏకపక్షంగా మండపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త లీలకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. -
కూలిన ఆశలు
[ 15-05-2024]
బిడ్డలకు చక్కటి భవితనివ్వాలని కాయకష్టాన్ని నమ్ముకున్న జీవులు వారంతా.. అమాంతం మృత్యు శకటం మీదపడి నలుగురి జీవితాలను చిదిమేసింది. మరో గంటకో.. ఘడియకో ఇల్లు చేరాల్సిన వారి ప్రయాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. -
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
[ 15-05-2024]
ఆన్లైన్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు వెతుక్కుని జనాల నుంచి రూ.లక్షలు దోచేస్తున్నారు. మొదట్లో ఈకేవైసీ, ఆధార్ లింక్ పేరిట మోసాలు జరిగేవి. తర్వాత కొన్నాళ్లకు ఆన్లైన్లో లాటరీ, రుణాలు, వస్తువులు విక్రయాలు.. రెట్టింపు నగదు.. ప్రభుత్వ పథకాలు.. వర్క్ ఫ్రం హోమ్ వంటి వాటితో మస్కా కొట్టేవారు. -
తెదేపా శ్రేణులపై వైకాపా మూకదాడి
[ 15-05-2024]
ఎన్నికలు ముగిసినా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆత్రేయపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా వర్గానికి చెందిన వేగేశ్న గోపిరాజు మంగళవారం సామాజిక మాధ్యమంలో అభ్యంతకర పోస్టు పెట్టారు. -
నిధులు మళ్లించి.. పల్లెను ముంచి
[ 15-05-2024]
గ్రామ స్వరాజ్యానికి పట్టుకొమ్మలైన పల్లెలను అయిదేళ్ల పాలనలో వైకాపా పూర్తిగా విస్మరించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల్వికపోవడంతో రోడ్లు, డ్రెయిన్లు, వివిధ భవన నిర్మాణాలు చేపట్టలేకపోయారు. -
పోలింగ్పై పార్టీల పంచనామా..
[ 15-05-2024]
సార్వత్రిక సమరం ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. ఓటరు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ నాలుగో తేదీ వరకు ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందనేది అధికారికంగా నిర్ధారణ కాదు. ఎన్నికల పోలింగ్ ఏవిధంగా జరిగింది.. -
ముందుగా ఓటేయాలని గొడవ.. యువకుడి అపహరణ
[ 15-05-2024]
మలికిపురం మండలంలో రామరాజులంక గ్రామానికి చెందిన రేకపల్లి నాగరాజు అనే యువకుడు కిడ్నాప్కు గురై సుమరు 10 గంటల అనంతరం సురక్షితంగా విడుదలైన ఘటన సంచలనమైంది. -
లెక్కలు పక్కాగా చూపకపోతే చిక్కులే..
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యేవరకు అయిన ఎన్నికల ఖర్చును అభ్యర్థులు పక్కాగా చూపాల్సిందే.