‘కార్యకర్తల మౌనం పార్టీకి ప్రమాదం’
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించాల్సిన పార్టీ కార్యకర్తలు మౌనం వహించడం ప్రమాదకరమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలపై సీఎం దృష్టి
వైకాపా ప్లీనరీ సమావేశంలో బాపట్ల ఎంపీ సురేష్
మాట్లాడుతున్న ఎంపీ సురేష్, వేదికపై మాజీ ఎమ్మెల్యే గరటయ్య తదితరులు
అద్దంకి, న్యూస్టుడే : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించాల్సిన పార్టీ కార్యకర్తలు మౌనం వహించడం ప్రమాదకరమని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం శింగరకొండ రోడ్డులోని కూకట్ల కల్యాణమండపం వద్ద ఆదివారం జరిగింది. సభకు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త/శాప్నెట్ ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో ఎన్నికల అజెండాలో పొందుపరచని హామీలు కూడా కొన్ని నెరవేర్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పాలన గురించి కార్యకర్తలు పెద్దగా ప్రచారం చేయడం లేదన్నారు. ప్రచారాస్త్రాలతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు పర్యటనలు చేస్తున్నారని, వారిని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు.
రహదారి సదుపాయం కల్పించాలి: గరటయ్య
కొత్తగా జిల్లా కేంద్రమైన బాపట్లకు అద్దంకి నుంచి సరైన రహదారి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఎంపీ నందిగం సురేష్పై ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గరటయ్య అన్నారు. గతనెలలో ఒంగోలులో జరిగిన తెదేపా మహానాడులో ‘అధికారంలోకి వస్తే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని’ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రానికి సరైన రహదారి సదుపాయాలు ఏర్పాటుచేసి ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాచిన చెంచు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ, నీటిపారుదల వ్యవస్థల్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల జిల్లా పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలంతా ఒక్కతాటిపై నిలిచి రాబోయే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేయాలన్నారు. సభాస్థలి వద్ద దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్మన్ ఎస్తేరమ్మ పాల్గొన్నారు.
బొప్పూడి నుంచే వెనుదిరిగిన మోపిదేవి
అద్దంకిలో వైకాపా ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ బొప్పూడి నుంచే వెనుదిరిగారు. అత్యవసరంగా అందిన సమాచారంతో ఆయన వెనక్కు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి. ఆయనను నియోజకవర్గ వైకాపా పరిరక్షణ సమితి నాయకులు ముందుగా బొప్పూడి వద్ద కలిశారు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావనూతల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమానికి ఊపిరై.. రాజధానికి సమిధలై..
[ 11-05-2024]
‘రాష్ట్ర విభజనతో పుట్టెడు కష్టాల్లో పడ్డాం. మనకూ ఒక రాజధాని ఉండాలి. పక్క రాష్ట్రాలతో దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. భావితరాల భవిష్యత్తు బాగుంటుందని’ నమ్మి రాజధాని రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను అమరావతి కోసం త్యాగాలు చేశారు. -
నోట్ల కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అన్నిదారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
పట్టలేదు.. కట్టలేదు!
[ 11-05-2024]
ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జీజీహెచ్ ఎలా ఉందో పోల్చి చూస్తే నాడే నయమని తేలిపోయింది. రోగులు, వారి సహాయకుల బాగు కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. -
సీఎం వచ్చారు.. నరకం చూపారు
[ 11-05-2024]
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. -
కక్షగట్టి.. పొట్టకొట్టి.. అమరావతి విధ్వంసం
[ 11-05-2024]
అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందన్న ఆశలను సీఎం జగన్ తుంచేశారు. రేయింబవళ్లు శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను కక్షగట్టి నిలిపేశారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ కొట్టారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశించారు. -
అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
[ 11-05-2024]
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
వేణుగోపాలుడి భూమినీ వదల్లేదు..!
[ 11-05-2024]
దేవుడి మాన్యంపై వైకాపా నాయకుడి కన్ను పడింది. వివరాల్లోకెళ్తే..గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం దేవుడి మాన్యం భూమిని వైకాపా నాయకులు కబ్జా చేశారు. -
పాలకుల నిరక్ష్యం.. ప్రజలకు శాపం
[ 11-05-2024]
వైకాపా పాలనలో పట్టణంలోని అధికార పక్ష సభ్యుల వార్డులు 38, 39, 40లలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
చినగంజాంలో వైకాపాకు షాక్
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ పర్చూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. -
కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నా లక్ష్యంతో అధికార పార్టీ అన్ని దారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
జగన్ జమానా.. రైతు నష్టాన
[ 11-05-2024]
పల్నాడు జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం