విస్తరణ సరే..మరి పునరుద్ధరణో..!
రహదారుల విస్తరణ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తేనే వాటివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో రహదారుల విస్తరణ పనులైతే ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తయిన వైపు నుంచి తిరిగి రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవటంతో ప్రజలకు ఆయా రహదారుల్లో అసౌకర్యం కలుగుతోంది.
రహదారుల టెండర్ల ప్రక్రియలోనే జాప్యం
ఈనాడు-అమరావతి
గుంటూరు కుగ్లర్ హాస్పటల్ రోడ్డులో రహదారి విస్తరణ పనులు
రహదారుల విస్తరణ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తేనే వాటివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో రహదారుల విస్తరణ పనులైతే ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తయిన వైపు నుంచి తిరిగి రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవటంతో ప్రజలకు ఆయా రహదారుల్లో అసౌకర్యం కలుగుతోంది.
పెదపలకలూరు, కుగ్లర్ ఆస్పత్రి, సుద్దపల్లి దొంక, నందివెలుగు రోడ్ల విస్తరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కనీసం వాటికి టెండర్లు పిలిచి సైడు కాల్వలు,. రహదారుల నిర్మాణం చేపట్టలేదు. టెండర్ల నిర్వహణ ప్రక్రియలోనే జాప్యం జరుగుతోంది. పెదపలకలూరు రహదారి చాలా అధ్వానంగా మారింది. వర్షం వస్తే చెరువును తలపిస్తోంది. వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వం నుంచి నగరపాలక అధికారులకు ఒత్తిళ్లు ఉన్నాయి. కాని వాటి పనులు ఇంకా ప్రారంభించలేదు. సైడు కాల్వలు నిర్మించి అప్పగిస్తే బీటీ రహదారి నిర్మిస్తామని ఆర్అండ్బీ అధికారులు గత కొంతకాలం నుంచి చెబుతున్నారు. అయినా నగరపాలక సంస్థలో చలనం లేదు. ఆ రహదారిలో సైడు కాల్వలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ గుత్తేదారుతో వెంటనే ఆ పనులు ప్రారంభింపజేయలేదు. మిగిలిన రహదారుల్లోనూ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించడం లేదు.
ఈ రహదారిలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతాయి. సత్తెనపల్లి,. నరసరావుపేట వైపు నుంచి గుంటూరుకు వచ్చే వాహనాలు ఎక్కువగా పలకలూరి రహదారి మీదగానే నగరంలోకి ప్రవేశిస్తాయి. ఇక కుగ్లర్ ఆస్పత్రి రహదారి విస్తరణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రైల్వేగేటు నుంచి శివాలయం వరకు రెండు వైపులా కాల్వలు నిర్మించి పునరుద్ధరించాలి. ఈ రహదారి విస్తరణే సుమారు నాలుగేళ్ల నుంచి పెండింగ్ పడింది. రహదారికి అడ్డుగా ఉన్నాయని గతంలోనే భవన నిర్మాణదారులకు నష్టపరిహారం చెల్లించి రహదారి విస్తరణ చేపట్టారు. కోర్టు కేసులు, స్థానికులు కొందరి నుంచి వ్యతిరేకత రావటంతో పనులు మధ్యలో నిలిపేశారు. తిరిగి విస్తరణ పనులను సుమారు నెల క్రితం ప్రారంభించారు. ఈరహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. మూడు వంతెనల గుండా కొత్తపేటలోని ఆస్పత్రులకు వచ్చే వాహనదారులు ఎక్కువుగా కుగ్లర్ హాస్పటల్ రోడ్ నుంచే ఓల్డుక్లబ్ రోడ్, బస్టాండ్కు చేరుకుంటారు. ఇది చాలా ప్రాధాన్యంతో కూడిన రహదారి. దీన్ని విస్మరించారు. నందివెలుగు రోడ్ ఏడేళ్ల నుంచి విస్తరణ పనుల్లోనే మగ్గుతోంది. కొంతదూరం 80 నుంచి 100 అడుగుల మీద విస్తరించారు. ఇక్కడ కూర్చొనే గాంధిబొమ్మ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు విస్తరణ పనులు నిలవగా వాటిని ప్రారంభించారు. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెనాలి వైపు ను ంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం కావటంతో ఈ రహదారి పనులను వెంటనే నిర్మించటానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే తప్ప రహదారి విస్తరణ వల్ల ప్రజలకు ప్రయోజనం కలగదు.
నత్తనడకన ఏటీ అగ్రహారం పనులు
ఏటీ అగ్రహారం రహదారి విస్తరణ పనులే నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు వేగవంతం కావటానికి వెంటనే భవనాలు, స్థలాలు కోల్పోయేవారికి నష్టపరిహారం చెల్లించి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి పనులే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పనుల నిర్వహణలోనూ అదే జాప్యం జరుగుతోంది. సకాలంలో నష్టపరిహారం చెల్లించి విస్తరణ పనులు చేపడితే ఇప్పటికే విస్తరణ పూర్తయ్యేది. ఇంజినీరింగ్ అధికారులే టెండర్లకు కసరత్తు చేయకుండా ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మేయర్ స్పందించి రహదారులు విస్తరించే ప్రాంతాల్లో తిరిగి రహదారుల పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమానికి ఊపిరై.. రాజధానికి సమిధలై..
[ 11-05-2024]
‘రాష్ట్ర విభజనతో పుట్టెడు కష్టాల్లో పడ్డాం. మనకూ ఒక రాజధాని ఉండాలి. పక్క రాష్ట్రాలతో దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. భావితరాల భవిష్యత్తు బాగుంటుందని’ నమ్మి రాజధాని రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను అమరావతి కోసం త్యాగాలు చేశారు. -
నోట్ల కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అన్నిదారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
పట్టలేదు.. కట్టలేదు!
[ 11-05-2024]
ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జీజీహెచ్ ఎలా ఉందో పోల్చి చూస్తే నాడే నయమని తేలిపోయింది. రోగులు, వారి సహాయకుల బాగు కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. -
సీఎం వచ్చారు.. నరకం చూపారు
[ 11-05-2024]
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. -
కక్షగట్టి.. పొట్టకొట్టి.. అమరావతి విధ్వంసం
[ 11-05-2024]
అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందన్న ఆశలను సీఎం జగన్ తుంచేశారు. రేయింబవళ్లు శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను కక్షగట్టి నిలిపేశారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ కొట్టారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశించారు. -
అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
[ 11-05-2024]
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
వేణుగోపాలుడి భూమినీ వదల్లేదు..!
[ 11-05-2024]
దేవుడి మాన్యంపై వైకాపా నాయకుడి కన్ను పడింది. వివరాల్లోకెళ్తే..గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం దేవుడి మాన్యం భూమిని వైకాపా నాయకులు కబ్జా చేశారు. -
పాలకుల నిరక్ష్యం.. ప్రజలకు శాపం
[ 11-05-2024]
వైకాపా పాలనలో పట్టణంలోని అధికార పక్ష సభ్యుల వార్డులు 38, 39, 40లలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
చినగంజాంలో వైకాపాకు షాక్
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ పర్చూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. -
కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నా లక్ష్యంతో అధికార పార్టీ అన్ని దారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
జగన్ జమానా.. రైతు నష్టాన
[ 11-05-2024]
పల్నాడు జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?