నీళ్లు వదిలాక కాలువ పనులా?
కాలువలకు నీటి విడుదల చేయని సమయంలో సహజంగా పూడిక తీయడం, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకు విరుద్ధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత పనులకు టెండర్లు పిలవడం గమనార్హం.
మరమ్మతులకు ఇప్పుడు టెండర్లు
అధికారుల తీరును తప్పుపడుతున్న రైతులు
ఈనాడు, అమరావతి
ఈనెల 7న డెల్టా కాలువలకు నీళ్లు వదులుతున్న సందర్భంలో నదికి పూజలు చేస్తున్న మంత్రి అంబటి
కాలువలకు నీటి విడుదల చేయని సమయంలో సహజంగా పూడిక తీయడం, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకు విరుద్ధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత పనులకు టెండర్లు పిలవడం గమనార్హం. నీటి ప్రవాహంలో పనులు ఏ మేరకు చేస్తారోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. జలవనరులశాఖ ఇంజినీర్లు ముందస్తుగా ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంతో ఈపరిస్థితి ఏర్పడింది.
కృష్ణా పశ్చిమడెల్టా కాలువలకు జూన్ 7న నీటిని విడుదల చేశారు. ఇప్పటికే పనులు పూర్తిచేసినట్లయితే పూర్తిస్థాయిలో పూడిక తొలగించారా? కట్టలు బలోపేతం చేసే పనుల నాణ్యత వంటివి పరిశీలించే అవకాశం ఉండేది. నీటిలో తూటుకాడ తొలగింపు వంటివి కనిపించినా మిగిలిన వాటి నాణ్యత పరిశీలన అటకెక్కినట్లే. నీటిలో పరిమాణాన్ని బట్టి లెక్కలు తీసే వెసులుబాటు లేనందున గుత్తేదారు చేసిందే పని అన్నట్లు తయారవుతుంది.
243 పనులు... రూ.21 కోట్లు
కృష్ణా పశ్చిమడెల్టాలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో 5.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు ఉన్నాయి. డెల్టా వ్యాప్తంగా మురుగుకాల్వలు విస్తరించాయి. కాలువలతో పాటు మురుగుకాల్వల నిర్వహణ కూడా కీలకం. పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రెయిన్లలో పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి మురుగునీరు పొలాలపైకి వస్తోంది. రైతులకు సాగునీరు సక్రమంగా అందాలంటే కాలువలు పటిష్ఠంగా ఉండటంతోపాటు నీటిప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈఏడాది రూ.21కోట్లతో 243 పనులు చేపట్టడానికి జలవనరులశాఖ సిద్ధమైంది. ఇందులో ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేయగా మరికొన్ని టెండరు ప్రక్రియ దశలోనే ఉన్నాయి. పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి జూన్ నెలాఖరు అవుతుంది. అప్పటికి వర్షాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో అటు కాలువలు, ఇటు మురుగుకాల్వల్లో నీటిప్రవాహం ఉండటంతో పూడిక పనులు ఏమేరకు చేస్తారో గుత్తేదారులకే తెలియాలి. తూటుకాడ తొలగించి పైపైన పనులు చేస్తే ఏడాది పొడవునా రైతులకు సాగునీటి అవస్థలు తప్పవు.
సాగునీరు అందేనా?
శ్రీరంగపురం సాగునీటి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క
కాలువలు, మురుగుకాల్వల నిర్వహణకు సకాలంలో నిధులు మంజూరుచేస్తే నీటి విడుదల సమయానికి పూడికతీత పనులు పూర్తి చేసేవారు. కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు కట్టలు బలహీనంగా ఉన్నచోట బలోపేతం చేసేవారు. నీటివిడుదల మొదలైన తర్వాత ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తూటుకాడ తొలగింపు పనులు చేపట్టేవారు. ఇలా ప్రణాళిక ప్రకారం జరిగితే రైతులకు ఇబ్బందులు లేకుండా సీజన్ ముగుస్తుంది. ఇందుకు విరుద్ధంగా కాలువలకు నీటి విడుదల తర్వాత టెండర్లు పిలిచి ఎవరికి ప్రయోజనం కల్పించడానికి పనులు అప్పగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పూర్తిస్థాయిలో చేయలేని దుస్థితి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున సాగునీటి కష్టాలు లేకుండా రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది కూడా పనులు సక్రమంగా చేయని పక్షంలో నీటిలభ్యత తగ్గితే ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 63కిలోమీటర్ల దూరం సాగే కొమ్మమూరు కాలువ నిర్వహణ చేపట్టకపోవడంతో కాలువ కట్టలు బలహీనంగా తయారయ్యాయి. కాలువ కింద లక్షన్నర ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 3500 సామర్థ్యం ఉన్నప్పటికీ 3200 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు. దీంతో బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువ దెబ్బతినడంతో లీకేజీల ద్వారా సాగునీరు వృథాగా పోతోంది. ఈసారి కూడా పనులు నామమాత్రంగా చేస్తే వేలమంది ఆయకట్టుదారులకు ఇబ్బందులు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
[ 16-05-2024]
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
అనుబంధాల్లో.. ఆరని మంటలు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కుమార్తె మంటలకు ఆహుతి అవుతున్నా కాపాడుకోలేని దైన్యం. గుండెలు పిండే ఈ హృదయ విదారక సంఘటన చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన దృశ్యం. -
ఖరీఫ్ సాగుకు.. సన్నద్ధమెప్పుడు?
[ 16-05-2024]
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పంటలు సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు, భూసార పరీక్షలు, పంటల విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది. -
చేతిలో పెడతారా.. చేతులెత్తేస్తారా?
[ 16-05-2024]
ఏటా అదే తంతు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మూడు, నాలుగు నెలల వరకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తూనే ఉంటారు. దీంతో అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చినా కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. -
నిర్లక్ష్యం ఖరీదు... నిండు ప్రాణాలు
[ 16-05-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చినగంజాం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టడంతో -
బాపట్ల జిల్లాలో 86.59 శాతం పోలింగ్
[ 16-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం అధికారికంగా వెలువడింది. జిల్లాలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.35 శాతం, రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 84.16 శాతం పోలింగ్ జరిగింది. -
ఓపికుంటేనే వైద్యం..
[ 16-05-2024]
నిత్యం 2వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తుంటారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా జీజీహెచ్లో రోజుకు ఎంత మంది... -
వైకాపా దాడులకు అడ్డుకట్ట పడేనా?
[ 16-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగాయి. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. -
పల్నాడులో 86.76 శాతం పోలింగ్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది నమోదు శాతం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ కలిపి బుధవారం తుది పోలింగ్ శాతం విడుదల చేశారు. -
పేద విద్యార్థినులకు ఉపకార వేతనాలు
[ 16-05-2024]
కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు గురువారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. -
తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
[ 16-05-2024]
కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి నివాసం ఉంటున్న పూరింటికి కుమార్తె నిప్పు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీˆఐ రమేష్బాబు బుధవారం తెలిపిన సమాచారం మేరకు.. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 16-05-2024]
ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నాయకులు కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు