logo

నందివాడ ఎస్‌ఐ భర్త అనుమానాస్పద మృతి

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పామర్తి శిరీష భర్త బి.అశోక్‌(30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు.

Updated : 11 Sep 2023 07:25 IST

భార్యతో అశోక్‌ (పాత చిత్రం)

నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పామర్తి శిరీష భర్త బి.అశోక్‌(30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్‌ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరఫు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సాయంత్రం ఈ సంఘటన జరిగితే మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచారు. రాత్రి 10 గంటల వరకు దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్‌ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐగా పని చేస్తూ 4 నెలల కిందట నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరోవైపు ఇది హత్యేనని అశోక్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని