కూటమి విజయ దుందుభి ఖాయం
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
మాట్లాడుతున్న జానీ మాస్టర్, పక్కన మండలి వెంకట్రామ్
అవనిగడ్డ, న్యూస్టుడే: రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం శనివారం అవనిగడ్డ వచ్చిన సందర్భంగా ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. రాజకీయంపై ఆసక్తితోనే కూటమి తరఫున ప్రచారానికి వచ్చాను. తొలుత కాస్త భయపడినా సినీ పరిశ్రమ తరహాలోనే రాజకీయ రంగంలో కూడా మంచి మద్దతు లభించిందన్నారు. ఇప్పటికే పిఠాపురం, కాకినాడలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నాను.. అక్కడ కూడా జనసేన పార్టీ గెలుపు ఖాయమన్నారు. మే 9, 10 తేదీల్లో మళ్లీ పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. తన పర్యటనలో విద్యార్థులతో మాట్లాడిస్తే రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఇలా ఉంటే పాఠశాలలు, కళాశాలలకు సమయానికి ఎలా చేరుకోగలమని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించి ఓట్లు అడగడానికి వస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు హామీ ఇచ్చి నిర్మించకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విక్రయిస్తూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల వైకాపా పాలనతో రాష్ట్రం రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిందని.. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేగాని రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఉచితాలు హక్కుగా భావిస్తున్నారు. ప్రజల్లో అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే అందరూ బాగుంటారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెంది రాష్ట్రం బాగు పడుతుందని అన్నారు. మండలి బుద్ధప్రసాద్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు అండగా ఉన్నారని, ఆయన సేవలకు ప్రజలు నమ్మకంతో గెలిపిస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారానికి తెర
[ 12-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా వైకాపా ఒక్కటే బరిలోకి దిగగా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. -
మేరునగ ధీరుడా..
[ 12-05-2024]
నాయకుడు సమర్థుడైతే ఆ సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. భావితరాల భవిష్యత్తుకు బాటలు పడతాయి. శాంతిభద్రతలు విలసిల్లి సమాజం భద్రతతో కూడిన జీవనానికి మార్గం సుగమం అవుతుంది. భవిష్యత్తుపై భరోసాతో సమాజం అడుగులు వేస్తుంది. -
ప్రతి ఒక్కరూ ఓటేయాలి... ప్రజాస్వామ్యం గెలవాలి
[ 12-05-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 6గంటలకు వరుసలో నిలుచున్న వారందరూ ఓటేసే వెసులుబాటు ఉంది. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ఒక్క అవకాశం.. ఐదేళ్ల విధ్వంసం
[ 12-05-2024]
రైతన్నల కష్టం కనని జగన్ యువతులపై అరాచకాలు ఆపలేని జగన్ యువత మత్తుకు బానిసలైనా వెరవని నీ పాలన చాలిక.. కక్షతో పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ ..ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని చంపిన జగన్ కార్మికులకు పని కల్పించలేని నీ పాలన చాలిక.. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి భద్రతా చర్యలు
[ 12-05-2024]
పోలింగ్ బందోబస్తుకు సీఐఎస్ఎఫ్, సీఆర్పిఎఫ్తోపాటు తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన బలగాలు గుంటూరు చేరుకున్నాయి. వారితో శనివారం ఎస్పీ తుషార్ దూడి పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. -
వైకాపా నాయకులకు చుక్కెదురు
[ 12-05-2024]
మీరు నగదు పంపిణీ చేశారు..మా ఓట్లను మీ పార్టీకి వేయాలని అభ్యర్థించాలి గాని.. .గద్దిస్తారేమిటని ఒక మహిళ డబ్బులు పంచడానికి వచ్చిన అధికార వైకాపా నాయకులను ప్రశ్నించింది. -
పల్నాడుపై ప్రత్యర్థుల పడగ నీడ!
[ 12-05-2024]
పల్నాడును వర్గాల పేరుతో అనాగరికం ఏలుతోంది! రక్షించాల్సిన నాలుగో సింహం నీలిగంతలు కట్టుకుంది బాధితులపైనే నిందలు వేసి వేధిస్తుంటే.. పచ్చని పల్లెలు ఖాళీ అవుతున్నాయి పక్కింటివారే ప్రత్యర్థులై పళ్లుకొరుకుతుంటే.. -
మా ఇంటిలో ఓట్లు అమ్మబడవు
[ 12-05-2024]
ఓట్లు కొనుగోలు చేయడానికి అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో గుంటూరులో ఓ ఇంటి వద్ద మా ఇంటిలోని ఓట్లు అమ్మబడవు అని ఏర్పాటు చేసిన బోర్డులు అందరినీ ఆకట్టుకున్నాయి. -
మాధవిపై అసత్య ప్రచారం.. కేసు నమోదు
[ 12-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
భవనం కట్టుకుంటే.. కుప్పం చెల్లించాల్సిందే!
[ 12-05-2024]
పాలకవర్గంలో ఓ ముఖ్య నాయకుడు పశ్చిమలో వాణిజ్య ప్రాంతాల్లో జరుగుతున్న పలు భవన నిర్మాణాలు, కట్టడాల వద్దకు తన మనుషులను పంపి దందాలు, అక్రమ వసూళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి. -
కసితో కదిలొచ్చారు!
[ 12-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. అభివృద్ధి పడకేసింది. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయనే ఆవేదన, ఆందోళన సగటు ఓటరులో నెలకొంది. -
ప్రచారానికి తెర.. ప్రలోభాల వల
[ 12-05-2024]
ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్