ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు.
మైనార్టీలు, దళితులను గుండెల్లో పెట్టుకుంటాం
మహిళ సమస్యను వింటున్న నారా లోకేశ్
పెదవడ్లపూడి(మంగళగిరి), న్యూస్టుడే: పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయిదు సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్ సీఎం అయ్యాక గతంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. మైనార్టీ సోదరులకు ఎలాంటి కష్టం రాకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తెదేపా హయాంలో రంజాన్ తోఫా, ఇమామ్ మౌజాలకు గౌరవ వేతనం, హజ్ యాత్రకు రాయితీ వంటి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు చాలా అన్యాయం చేశారన్నారు. హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి చూస్తున్నామన్నారు. సీఏఏ బిల్లుపై వైకాపా దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ బిల్లు ఆనాడు లోక్సభలో వస్తే అక్కడ ఉన్న 22 మంది వైకాపా ఎంపీలు గంపగుత్తగా దాని ఆమోదం కోసం ఓటేశారన్నారు. రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వైకాపాకు చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఓటేశారన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే ఎమ్మెల్యే ఆర్కే, అభ్యర్థిని ఈ అంశంపై ప్రశ్నించాలని, సీఏఏ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని నిలదీయాలని పిలుపునిచ్చారు. జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్చంద్, భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, జనసేన, తెదేపా, భాజపా గ్రామ నాయకులు పాల్గొన్నారు. పక్కా ఇళ్లు నిర్మించాలని, కృష్ణాజలాలు అందించి తాగునీటి ఎద్దడి నివారించాలని పలువురు రైతులు, మహిళలు విన్నవించగా.. పరిష్కరిస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమానికి ఊపిరై.. రాజధానికి సమిధలై..
[ 11-05-2024]
‘రాష్ట్ర విభజనతో పుట్టెడు కష్టాల్లో పడ్డాం. మనకూ ఒక రాజధాని ఉండాలి. పక్క రాష్ట్రాలతో దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. భావితరాల భవిష్యత్తు బాగుంటుందని’ నమ్మి రాజధాని రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను అమరావతి కోసం త్యాగాలు చేశారు. -
నోట్ల కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అన్నిదారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
పట్టలేదు.. కట్టలేదు!
[ 11-05-2024]
ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జీజీహెచ్ ఎలా ఉందో పోల్చి చూస్తే నాడే నయమని తేలిపోయింది. రోగులు, వారి సహాయకుల బాగు కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. -
సీఎం వచ్చారు.. నరకం చూపారు
[ 11-05-2024]
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. -
కక్షగట్టి.. పొట్టకొట్టి.. అమరావతి విధ్వంసం
[ 11-05-2024]
అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందన్న ఆశలను సీఎం జగన్ తుంచేశారు. రేయింబవళ్లు శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను కక్షగట్టి నిలిపేశారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ కొట్టారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశించారు. -
అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
[ 11-05-2024]
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
వేణుగోపాలుడి భూమినీ వదల్లేదు..!
[ 11-05-2024]
దేవుడి మాన్యంపై వైకాపా నాయకుడి కన్ను పడింది. వివరాల్లోకెళ్తే..గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం దేవుడి మాన్యం భూమిని వైకాపా నాయకులు కబ్జా చేశారు. -
పాలకుల నిరక్ష్యం.. ప్రజలకు శాపం
[ 11-05-2024]
వైకాపా పాలనలో పట్టణంలోని అధికార పక్ష సభ్యుల వార్డులు 38, 39, 40లలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
చినగంజాంలో వైకాపాకు షాక్
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ పర్చూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. -
కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నా లక్ష్యంతో అధికార పార్టీ అన్ని దారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
జగన్ జమానా.. రైతు నష్టాన
[ 11-05-2024]
పల్నాడు జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయింది.