డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం.
నిరుద్యోగులను మోసం చేసిన జగన్
శిక్షణకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం.
ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి లేకుండా చేస్తాం. ప్రతి స్కూల్లో డబుల్ టీచర్లు ఉండేలా చూస్తాం.
గత ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాట ఇది
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను.. నేను విన్నాను.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా.. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా.. ఉపాధ్యాయ నియామకాలు చేపడతా అంటే నిరుద్యోగులు నిజమే అని నమ్మారు. తీరా అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ యువతకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో పాఠశాలల విలీనం పేరుతో ఖాళీలు లేవని చెబుతూ వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల నిరసనలతో దిగి వచ్చి ఇచ్చిన నోటిఫికేషన్ నిరాశనే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాలల్లో చాలీచాలని జీతాలతో పని చేయలేక, మరో ఉద్యోగ అవకాశాలు లేక దిక్కుతోచని దుస్థితిలో డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు.
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే నరసరావుపేట అర్బన్
వైకాపా అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోగా పాఠశాలల విలీనం పేరుతో టీచర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తీసుకెళ్లి వారిపై విపరీతంగా పనిభారం పెంచేసి ఉపాధ్యాయుల నడ్డివిరిచారు. ఆయన చెప్పిన ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో డబుల్ టీచర్లను నియమించింది లేదు. ఇప్పటికీ ఉమ్మడి గుంటూరులో పలు చోట్ల ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. సత్తెనపల్లి డివిజన్ గోగులమూడి, పాకాలపాడులోని పాఠశాలల్లో ఒక్కొక్కరే టీచర్ ఉన్నారు. ఆ టీచర్ అత్యవసరమై సెలవు పెడితే స్కూల్ మూతపడడమే. నాడు-నేడు పేరుతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని నమ్మబలికి టీచర్లపై పెట్టే ఖర్చు తగ్గించుకోవాలని టీచర్ల నియామకాలకు జగన్ సర్కార్ స్వస్తి పలికింది. అధికారంలోకి వచ్చి ఐదేళ్లయితే ఏనాడూ డీఎస్సీ నోటిఫికేషన్ల గురించి పట్టంచుకోని జగన్ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా నిరుద్యోగుల ఓట్లు దండుకోవాలని నోటిఫికేషన్ విషయం గుర్తుకొచ్చింది. అదే తడవుగా ఆరు వేల పోస్టుల భర్తీకి ఈ మధ్య నోటిఫికేషన్ ఇవ్వగా దానికి ఈసీ బ్రేకులు వేసింది. ఎన్నికలకు ముందు ఇలాంటివి సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాగానే పోస్టులు భర్తీ చేస్తారని
జగన్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు ప్రైవేటు పాఠశాలలు, ఇతరత్రా కొలువులు చేసుకుంటూ ఉన్నవారిలో చాలామంది డీఎస్సీ పోస్టులపై నమ్మకంతో ఆ కొలువులు మానేసి డీఎస్సీ కోచింగ్కు వెళ్లారు. సంవత్సరాలు గడుస్తున్నా నోటిఫికేషన్ ఇవ్వటం లేదు. ఒకసారి కరోనా అడ్డొచ్చిందని మరోసారి పాఠశాలల విలీన ప్రక్రియ పూర్తికాగానే జిల్లాల వారీగా ఖాళీలు గుర్తించి వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా మోసపుచ్చటమే తప్ప వాస్తవంగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో కోచింగ్ కోసమని వెళ్లిన వారికి చేతి చమురు వదలటంతోపాటు ఉన్న కొలువులను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒకవైపు ఆర్థికంగా కుదేలై మరోవైపు కలల టీచర్ ఉద్యోగం సాకారం కాక ఉపాధ్యాయ శిక్షణార్థులు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మెగా డీఎస్సీ నిర్వహించాలంటూ ఫిబ్రవరిలో నిరుద్యోగుల ఆందోళన
విలీనంతో పోస్టులు తగ్గిపోయి
పాఠశాలలు విలీనంతో పోస్టుల్లో కోతపడ్డాయి. గతంలో 20-30 మంది పిల్లలు ఉన్నా ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉండేవారు. విలీనంతో ఆ సంఖ్య తగ్గిపోయింది. 20 మంది లోపు అయితే ఒకరితోనే సరిపుచ్చారు. 3, 4, 5 తరగతుల పిల్లలను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి పిల్లలతో సహా టీచర్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయటంతో ఖాళీలు తగ్గిపోయాయి. టీచర్ల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవటంతో చాలామంది నష్టపోయారు. తిరిగి వారికి ఎన్నికల ముందు ఆశలు రేకెత్తించారు. ఏటా సంక్రాంతి నాడు జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల మేనిఫేస్టోలోనే చెప్పటంతో ప్రభుత్వ కొలువే ధ్యేయంగా వ్యయ, ప్రయాసలకోర్చి అహోరాత్రులు కష్టపడి చదివిన నిరుద్యోగులకు ప్రయోజనం లేకుండా పోయింది.
ఖాళీలు 2 వేలు ఇచ్చింది 105 పోస్టులు
జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టులు 2వేల వరకు ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరŸత ప్రభావం ప్రవేశాలపై కూడా పడింది. ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరుతున్న పరిస్థితి ఉంది. కాగా నిరుద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఖాళీలను 105గా చూపింది. టెట్ పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సరిగాలేవు. దీంతో న్యాయస్థానం 21 రోజులు సమయం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఏటా పది వేలమంది
ఉమ్మడి గుంటూరుజిల్లాలో 60 బీఎడ్, 50 వరకు డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఏటా 10వేలమంది శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. అయిదేళ్లలో 50 వేల మంది వరకు శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూశారు. జగన్ సర్కారు ఒక్కటంటే ఒక్క డీఎస్సీ నోటిపికేషన్ వెలువరించలేదు. దీంతో 50 వేల మంది ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
- జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో డైట్ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయలేదు. ఈ పోస్టులకు ఎంఈడీ చేసిన వారు అర్హులు. ప్రతి పోస్టు ఇన్ సర్వీస్ ఉద్యోగులతో భర్తీ చేసి టీచర్ల నియామకాలను నిర్వీర్యం చేసిందన్న అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. చివరకు డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీ చేపట్టలేదు. ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు కలిపితే ఉమ్మడి గుంటూరులో 3 వేలకు పైగా ఖాళీలు ఉంటాయని అంచనా.
ఇప్పటికే రూ.2.5లక్షలు ఖర్చయింది
నాన్న కౌలు రైతు. పంటలు సక్రమంగా పండితేనే కుటుంబం జరుగుతుంది. 2016-18లో డీఈడీ పూర్తి చేశా. 2019 ఎన్నికల్లో ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ ఇచ్చిన హామీని నమ్మాం. ఓటు వేశాం. అయితే ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డీఎస్సీ వస్తుందన్న ఆశతో అప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నా. కుంకులగుంట నుంచి ఉదయం రావడం సాయంత్రం వరకు పట్టణంలో శిక్షణ తీసుకున్న కోచింగ్ సెంటర్లో చదువుకోవడం చేస్తున్నా. అయిదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నా. ప్రభుత్వ నిర్ణయాలు మానసిక ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 2.5 లక్షలు ఖర్చయింది.
కొప్పుల నిఖిల, కుంకులగుంట, నకరికల్లు మండలం
జాబ్ క్యాలెండర్ లేదు
మాది కౌలురైతు కుటుంబం. ఏటా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తారు. అలా వచ్చిన ఆదాయంతోనే జీవిస్తున్నాం. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్ ఇచ్చిన హామీని నమ్మాం. 2018లో డీఈడీ పూర్తి చేశా. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రాలేదు. ఇప్పటికే లక్షన్నర ఖర్చయింది. ప్రైవేటు ఉద్యోగం చూసుకోమని చెబుతున్నారు. ఏం చేయలో దిక్కు తోచడం లేదు.
-దాసరి సౌజన్య, వీరాటం, రొంపిచర్ల మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
[ 15-05-2024]
బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయినవారిపాలెంలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా తెదేపా నేత, మాజీ సర్పంచి నర్రా ఏడుకొండలుపై వైకాపా మూకలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో నలుగురు పోలీసు సిబ్బందితో నామమాత్రంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
[ 15-05-2024]
ఎన్నికల విధులకు హాజరై తిరుగు ప్రయాణంలో విశ్రాంతి కోసం ఆగిన భద్రతా సిబ్బంది భోజనం కోసం వెళ్లి హోటల్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో చోటు చేసుకుంది. -
అదే జోష్.. స్ఫూర్తి భేష్!
[ 15-05-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు బాధ్యతను ఓటర్లు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించారు. -
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
[ 15-05-2024]
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. నేతలు మొదలుకుని మిర్చి, కాటన్, పొగాకు వ్యాపారులు, గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారులు, ఉద్యోగవర్గాలు ఇలా ఈసారి పందేలు కాస్తున్న వారిలో ఉండడం గమనార్హం. రాజకీయ చైతన్యానికి మారుపేరు అయిన గుంటూరులో పందేలు బాగా ఊపందుకున్నాయి. -
కూటమిలో ఉత్సాహం
[ 15-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి తరఫున పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో జోష్ నెలకొంది. ఓటర్లు పెద్దఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. -
పిన్నెల్లి సోదరుల అరాచకాలు అడ్డుకోవడంలో ఎస్పీ విఫలం
[ 15-05-2024]
మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలను అడ్డుకోవడంలో పల్నాడు ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేసి దాడులు, ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని కోరినా స్పందించలేదని మండిపడ్డారు. -
ఓటేసిన వారు 82.33%
[ 15-05-2024]
తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్ సరళిపై పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సిఫార్సులతో వచ్చిన సీఐలు, ఎస్సైలు విధులు మర్చిపోయారు
[ 15-05-2024]
సిఫార్సుతో వచ్చిన సీఐలు, ఎస్సైలు విధులను మర్చిపోయారని, ఇప్పుడు ఎన్నికల సంఘ పరిధిలో ఉన్నామని గుర్తెరగకుండా ఉన్నారని కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. -
ఈవీఎంల అప్పగింతకు 12 గంటలా?
[ 15-05-2024]
సార్వత్రిక పోలింగ్ ముగిసిన తర్వాత సామగ్రి అప్పగించేందుకు సిబ్బంది 12 గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నరసరావుపేటలో నెలకొంది. తాగేందుకు నీరు లేదు. వేచి ఉండేందుకు వసతి లేదు. ఒకవైపు వాహనాల పార్కింగ్ సౌకర్యం లేక సింగిల్ రోడ్డు కావడంతో సమస్య తీవ్రత పెంచింది. -
పీవో తప్పిదం.. అంతా గందరగోళం
[ 15-05-2024]
మంగళగిరి సీకె జూనియర్ కళాశాలలో పోలింగ్ నిర్వహణలో తలెత్తిన సమస్యతో ఈవీఎంల తరలింపులో తీవ్రజాప్యం జరిగింది. పోలింగ్ కేంద్రం 178లో ప్రీసైడింగ్ అధికారి తప్పిదం కారణంగా అదే భవనంలో ఉన్న ఎనిమిది పోలింగ్ కేంద్రాల సిబ్బందికి గంటల తరబడి సమయం వృథా అయ్యింది. -
వల్లాపల్లిలో వైకాపా నేతల దౌర్జన్యం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసినందుకు ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై మండలంలోని వల్లాపల్లిలో మంగళవారం సాయంత్రం వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. -
ఏ క్షణాన .. ఏం జరుగునో?
[ 15-05-2024]
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులతో కలిసి పది వాహనాలతో నియోజకవర్గంలో తిరుగుతూ హల్చల్ చేశారు. అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఐదు వాహనాలు, పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాల కాన్వాయ్తో అనుచరులతో వెళ్లి అలజడి సృష్టించారు. -
అందని అత్యవసర వైద్యం
[ 15-05-2024]
గతేడాది ఆగస్టు 3న 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేటలో రూ.9.45 కోట్లతో ఆసుపత్రి చుట్టూ రిటైనింగ్ వాల్, ప్రహరీ, సిమెంటు రహదారులు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 15-05-2024]
తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో యువకుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఇరువర్గాల ఘర్షణ
[ 15-05-2024]
గుంటూరు కృష్ణబాబుకాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాలనీకి చెందిన ప్రభు, మున్నాలకు కొంతకాలంగా పరిచయం ఉన్నది. -
రాష్ట్ర పీఆర్ సంఘ నాయకుడి సస్పెన్షన్
[ 15-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే అభియోగంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె.మోహనరావుపై జిల్లా అధికారులు సస్పెండ్ వేటు వేశారు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు : తెదేపా
[ 15-05-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారని తెదేపా నేతలు విమర్శించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్లతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఆ ఘటన వెనుక కుట్ర, కుతంత్రం బహిర్గతం చేస్తా
[ 15-05-2024]
తెనాలి ఐతానగర్లోని ఎర్రబడి (మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల) పోలింగ్ బూత్లో ఈనెల 13న జరిగిన ఘటన వెనుక కుట్ర, కుతంత్రం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. -
పెద్దవాళ్లకూ బీసీజీ టీకా
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా క్షయ నివారణ కోసం పెద్దవాళ్లకు బీసీజీ టీకా ఇచ్చే కార్యక్రమం ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్