ఓటేసిన వారు 82.33%
తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్ సరళిపై పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అద్దంకి అత్యధికం.. రేపల్లె అత్యల్పం
చివరి గంటలో పోటెత్తిన ఓటర్లు
బాపట్ల, న్యూస్టుడే
తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్ సరళిపై పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తమకు సానుకూలంగా జరిగిందని ఆనందంలో ఉన్నారు. ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసి వైకాపా నేతలు, శ్రేణులు డీలాపడ్డారు. బాపట్ల పట్టణంలో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏడెనిమిది చోట్ల తప్పా చాలాచోట్ల వైకాపా నేతల జాడే కనిపించలేదు.
సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. చీరాల, పర్చూరు, వేమూరు నియోజకవర్గాల్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత పది శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం. జిల్లాలో అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో 86.75 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా రేపల్లె నియోజకవర్గంలో 78.16 శాతానికి పోలింగ్ పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా 82.33 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అధికారికంగా పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపిన తర్వాత తుది పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయడంతో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, విజయం తమదేనని తెదేపా కూటమి నేతలు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చీరాల నియోజకవర్గంలో చివరిలో పుంజుకున్న పోలింగ్
జిల్లాలో మిగతా ఐదు నియోజకవర్గాలతో పోలిస్తే చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ నెమ్మదిగా సాగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 64.53 శాతం పోలింగ్ జరిగింది. పేరాల, ఇతర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ సాగింది. పోలింగ్ ముగిసే సమయానికి 83.32 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరిలో 19 శాతానికి పైగా పోలింగ్ జరగడం గమనార్హం. చీరాల పట్టణంలో వచ్చిన ఓట్లు అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఐదు తర్వాత 10.69 శాతం ఓటర్లు ఓటు వేశారు. సాయంత్రం ఆరు తర్వాత పోలింగ్ కొనసాగి వేమూరులో పది శాతం, రేపల్లెలో ఏడు శాతం, బాపట్లలో ఎనిమిదిన్నర శాతం, పర్చూరులో ఏడున్నర శాతం ఓటర్లు ఓటు వేయటం విశేషం. పర్చూరు మండల కేంద్రంలోని 139, 138 పోలింగ్బూత్లు, యద్దనపూడి ఎస్సీ కాలనీ, పోలూరు, మార్టూరు మండలం కోలలపూడి, జొన్నతాళి, కారంచేడు మండలంలో, వేమూరు మండలం పెరవలిపాలెం 128వ పోలింగ్బూత్లలో సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఈవీఎంలు మొరాయించటం, వర్షం కురిసి కరెంటు సరఫరాలో అంతరాయం, ఘర్షణలు కారణంగా పోలింగ్ ఆగటం తదితర కారణాలతో పోలింగ్ ప్రక్రియ జాప్యమైంది. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు మంగళవారం తెల్లవారుజామున చేరుకున్నాయి. పార్టీ అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు అధికారులు సీలు వేశారు. జూన్ నాలుగో తేదీ ఉదయం సీలు తీసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
భారీగా తరలివచ్చిన నారీమణులు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేశారు. ఏ పోలింగ్ కేంద్రం చూసినా నారీమణుల సందడే కనిపించింది. క్యూలైన్లో రెండు గంటలకుపైగా ఓపికగా వేచి ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల పోలింగ్ ఎక్కువ శాతం జరిగింది. యువత సైతం భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, యువత తమకే ఓట్లు వేశారని తెదేేపా కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు. 2019లో జిల్లాలో 86 శాతం పోలింగ్ జరిగింది. సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో 82.33 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపితే పోలింగ్ 86 శాతం దాటుతుందని, గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్ జరిగిందని అధికార వర్గాలు అంటున్నాయి. భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అదుపులో నకిలీ కరెన్సీ ముఠా
[ 28-05-2024]
నకిలీ కరెన్సీ చలామణి కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను భవానీపురం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. -
ఎందుకీ ‘శిక్ష’ణ?
[ 28-05-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారుచేసే వంట ఏజెన్సీ మహిళలకు ఫైవ్స్టార్ హోటళ్ల చెఫ్లతో వంటల తయారీపై శిక్షణ ఇప్పిస్తున్నారు. -
తూకాల్లో మోసం.. తనిఖీలు తూతూమంత్రం
[ 28-05-2024]
ఆర్.అగ్రహారానికి చెందిన ప్రకాష్ ఇటీవల మార్కెట్ సెంటర్లో కిలో ద్రాక్ష కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి తూకం వేసుకోగా 200 గ్రాముల తరుగు వచ్చింది. -
ఎందుకో ఇంత హడావుడి
[ 28-05-2024]
నగర, పురపాలక సంఘాల్లో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే కొత్త వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం వీటిని పంపుతోంది. -
కానిస్టేబుల్ ప్రాణం తీసిన వేగ నిరోధకం
[ 28-05-2024]
రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ వీరాస్వామి వివరాల ప్రకారం.. -
శకుంతలమ్మ వ్యక్తిత్వం ఆదర్శనీయం
[ 28-05-2024]
మాదల శకుంతలమ్మ వ్యక్తిత్వం, విజయాల నుంచి ఈ తరం ప్రేరణ పొందాలని మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. -
కంప్యూటర్ సైన్స్ సీట్లు బోలెడు
[ 28-05-2024]
బీటెక్లో కంప్యూటర్ సైన్స్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ కోర్సులో చేరేందుకు పోటీ ఏటేటా పెరుగుతుంది. -
‘అమరావతిని నాశనం చేయలేరు’
[ 28-05-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాలను దాటుకొని అమరావతి పురి విప్పుకొనే రోజు దగ్గర పడుతుందని రాజధాని రైతులు పేర్కొన్నారు. -
విచారణకు రైల్వే కమిటీ
[ 28-05-2024]
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం సరకుల రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ మండల రైల్వే అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గుండ్లకమ్మలో మట్టి దందా
[ 28-05-2024]
అధికార పార్టీ ప్రజాప్రతినిధి అడ్డగోలుగా చేపడుతున్న మట్టి తవ్వకాలను ఉపాధి కూలీలు, స్థానికులు అడ్డుకున్న ఉదంతమిది. -
ఉత్తమాటలే.. నిధుల మూటలేవి?
[ 28-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా కాలువ మరమ్మతుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 8.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
-
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
-
ఆ గాలి మాటలను పట్టించుకోను: ప్రధానిమోదీ
-
సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరం: పవన్ కల్యాణ్
-
హైకోర్టులో డేరా బాబాకు ఊరట.. రంజిత్ సింగ్ హత్యకేసులో నిర్దోషిగా తీర్పు
-
నాకు ఆ రుగ్మత ఉన్నట్లు ఇటీవలే తెలిసింది: ఫహాద్ ఫాజిల్