పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు.
సీఎం ప్రసంగం విమర్శలకే పరిమితం
పొన్నూరు సభలో మాట్లాడుతున్న సీఎం జగన్
పొన్నూరు, న్యూస్టుడే: పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. కూటమి నాయకులపై అవే మాటలు, అవే విమర్శలతో సరిపెట్టారు. సీఎం ప్రసంగంలో పసలేకపోవడంతో జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఎక్కువ సేపు మాట్లాడారు. సీఎం వేదికకు రాకముందే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు. గుంటూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ తమ హయాంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించామన్నారు. పొన్నూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.
ప్రధాన కూడలిలో నిలువ నీడ లేక జనం ఇబ్బందులు
జనం లేక బోసిపోయిన సభ
సీఎం సభకు అనుకున్న మేర జనం హాజరుకాకపోవడంతో వెలవెలబోయింది. సమావేశానికి హాజరైన ఆ కొంత మందికి రూ.300 నుంచి రూ.500 వరకు వైకాపా నేతలు ఇచ్చారు. డబ్బుల పంపకాలు చేసినా జనం అశించిన మేర హాజరుకాలేదు. సీఎం ప్రసంగం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో కొంత సమయానికే ప్రజలు వెనుతిరిగారు. సభ 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా జనం లేకపోవడంతో ఆయన వేదిక వద్దకు 4 గంటలకు చేరుకున్నారు.
రేపల్లె మార్గంలో రోడ్డుపై చేరిన నీటితో అవస్థలు పడుతూ వెళ్తున్న వాహనదారులు
సారొచ్చె.. కష్టాలు తెచ్చె
సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా పొన్నూరు పట్టణంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు, ప్రజలు అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం రాకను పురస్కరించుకొని విద్యుత్తుశాఖ అధికారులు ఎర్త్ కోసం రేపల్లె మార్గంలో పొక్లెయిన్తో గుంత తవ్వుతుండగా తగిలి రెండు ప్రధాన పైపులైన్లు పగిలిపోయాయి. నీరంతా రహదారిపైకి చేరి చెరువులా మారింది. పైపులైన్ల మరమ్మతుల కోసం మంగళవారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. గుంటూరు నుంచి నారాకోడూరు మీదుగా తెనాలి పోయే వాహనాలను నిలిపివేసి.. వాటిని పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి నందివెలుగు మీదుగా తెనాలికి మళ్లించారు. బాపట్ల నుంచి గుంటూరుకు వెళ్లే వాహనాలను పెదనందిపాడు మీదుగా మళ్లించారు. దూరభారం పెరిగిందని వాహనదారులు వాపోయారు. పొన్నూరు మండలం చింతలపూడి వద్ద, పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జనసంచారం లేకపోవడంతో వైకాపా నాయకుల సిఫార్సు మేరకు పొన్నూరు ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లును పోలీసులు తొలగించారు. పట్టణ పరిధి జీబీసీ రహదారిలో 10 వైద్యశాలలు ఉన్నాయి. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల రాకపోకలు సాగించేందుకు రోగుల కుటుంబ సభ్యులు అనేక కష్టాలు పడ్డారు. వైద్యశాల ప్రాంగణం దాటి 4 గంటలపాటు బయటకు వెళ్లనీయకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుబంధాల్లో.. ఆరని మంటలు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కుమార్తె మంటలకు ఆహుతి అవుతున్నా కాపాడుకోలేని దైన్యం. గుండెలు పిండే ఈ హృదయ విదారక సంఘటన చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన దృశ్యం. -
ఖరీఫ్ సాగుకు.. సన్నద్ధమెప్పుడు?
[ 16-05-2024]
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పంటలు సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు, భూసార పరీక్షలు, పంటల విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది. -
చేతిలో పెడతారా.. చేతులెత్తేస్తారా?
[ 16-05-2024]
ఏటా అదే తంతు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మూడు, నాలుగు నెలల వరకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తూనే ఉంటారు. దీంతో అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చినా కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. -
నిర్లక్ష్యం ఖరీదు... నిండు ప్రాణాలు
[ 16-05-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చినగంజాం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టడంతో -
బాపట్ల జిల్లాలో 86.59 శాతం పోలింగ్
[ 16-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం అధికారికంగా వెలువడింది. జిల్లాలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.35 శాతం, రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 84.16 శాతం పోలింగ్ జరిగింది. -
ఓపికుంటేనే వైద్యం..
[ 16-05-2024]
నిత్యం 2వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తుంటారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా జీజీహెచ్లో రోజుకు ఎంత మంది... -
వైకాపా దాడులకు అడ్డుకట్ట పడేనా?
[ 16-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగాయి. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. -
పల్నాడులో 86.76 శాతం పోలింగ్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది నమోదు శాతం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ కలిపి బుధవారం తుది పోలింగ్ శాతం విడుదల చేశారు. -
పేద విద్యార్థినులకు ఉపకార వేతనాలు
[ 16-05-2024]
కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు గురువారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. -
తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
[ 16-05-2024]
కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి నివాసం ఉంటున్న పూరింటికి కుమార్తె నిప్పు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీˆఐ రమేష్బాబు బుధవారం తెలిపిన సమాచారం మేరకు.. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 16-05-2024]
ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నాయకులు కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.