కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వేణుగోపాల్రెడ్డి
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై బుధవారం జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలు అరికట్టడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్లు, ఎఫ్ఎస్టీ, నిఘా బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చిన 286 ఫిర్యాదుల్లో నిర్దేశించిన 100 నిమిషాల వ్యవధిలో 279 (98 శాతం) పరిష్కరించినట్లు వివరించారు. సమావేశంలో జిల్లా శిక్షణ కలెక్టరు స్వప్నిల్ జగన్నాథ్, ఎంసీసీ నోడల్ అధికారి వీరాచారి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కంచర్ల శివరామయ్య (తెదేపా), అత్తోట జోసఫ్ (వైకాపా), పి.ఎ.పద్మనాభరావు (భాజపా), బిళ్లా సునీల్ (కాంగ్రెస్), వై.కృష్ణకాంత్ (సీపీఎం), చిరతనగండ్ల వాసు (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
[ 16-05-2024]
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
అనుబంధాల్లో.. ఆరని మంటలు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కుమార్తె మంటలకు ఆహుతి అవుతున్నా కాపాడుకోలేని దైన్యం. గుండెలు పిండే ఈ హృదయ విదారక సంఘటన చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన దృశ్యం. -
ఖరీఫ్ సాగుకు.. సన్నద్ధమెప్పుడు?
[ 16-05-2024]
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పంటలు సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు, భూసార పరీక్షలు, పంటల విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది. -
చేతిలో పెడతారా.. చేతులెత్తేస్తారా?
[ 16-05-2024]
ఏటా అదే తంతు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మూడు, నాలుగు నెలల వరకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తూనే ఉంటారు. దీంతో అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చినా కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. -
నిర్లక్ష్యం ఖరీదు... నిండు ప్రాణాలు
[ 16-05-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చినగంజాం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టడంతో -
బాపట్ల జిల్లాలో 86.59 శాతం పోలింగ్
[ 16-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం అధికారికంగా వెలువడింది. జిల్లాలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.35 శాతం, రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 84.16 శాతం పోలింగ్ జరిగింది. -
ఓపికుంటేనే వైద్యం..
[ 16-05-2024]
నిత్యం 2వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తుంటారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా జీజీహెచ్లో రోజుకు ఎంత మంది... -
వైకాపా దాడులకు అడ్డుకట్ట పడేనా?
[ 16-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగాయి. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. -
పల్నాడులో 86.76 శాతం పోలింగ్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది నమోదు శాతం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ కలిపి బుధవారం తుది పోలింగ్ శాతం విడుదల చేశారు. -
పేద విద్యార్థినులకు ఉపకార వేతనాలు
[ 16-05-2024]
కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు గురువారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. -
తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
[ 16-05-2024]
కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి నివాసం ఉంటున్న పూరింటికి కుమార్తె నిప్పు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీˆఐ రమేష్బాబు బుధవారం తెలిపిన సమాచారం మేరకు.. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 16-05-2024]
ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నాయకులు కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ