Telangana News: పుట్టిన రోజే చివరి రోజు
ఉద్యోగానికి వెళ్తూ పుట్టిన రోజు నాడే రైలు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రలోని వీటీసీ షోలాపూర్
ఎంఎంటీఎస్ ఢీకొని మహిళ మృతి
ఖైరతాబాద్, నాంపల్లి - న్యూస్టుడే: ఉద్యోగానికి వెళ్తూ పుట్టిన రోజు నాడే రైలు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రలోని వీటీసీ షోలాపూర్ న్యూరంగరాజ్నగర్ ప్రాంతానికి చెందిన రమేష్ రచ్చకు భార్య, కుమార్తె లావణ్య(36), ఇద్దరు కుమారులున్నారు. లావణ్యను అదే ప్రాంతానికి చెందిన గణేష్కు ఇచ్చి 17 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త ప్రవర్తన భరించలేక షోలాపూర్ కోర్టులో విడాకులకు దాఖలు చేసుకుంది. ఈ కేసు పెండింగ్లో ఉంది. మూడేళ్ల క్రితం తల్లిదండ్రులతో పాటు ఇద్దరు కుమార్తెలను తీసుకుని నగరానికి వలసవచ్చి ఖైరతాబాద్లోని తుమ్మలబస్తీలో అద్దెకుంటోంది. తండ్రి రమేష్ ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, లావణ్య టెలికాలర్గా పని చేస్తోంది.
పులిహోర వండి పెట్టి.. తన జన్మదినం సందర్భంగా బుధవారం లావణ్య ఉదయం ఇంట్లో అందరికీ ఇష్టమైన పులిహోర చేసి వడ్డించి, తానూ టిఫిన్ కట్టుకుని ఉద్యోగానికని బయలుదేరింది. ఖైరతాబాద్ రైల్వే పట్టాలు దాటే సమయంలో అటువైపు పట్టాలపై ఓ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఆ రైలు వెళ్లిన తర్వాత పట్టాలు దాటొచ్చని పట్టాలకు ఇటువైపున పక్కనే నిల్చుంది. అదే సమయంలో ఇటువైపున ట్రాక్పై ఎంఎంటీఎస్ రైలు దూసుకొచ్చింది. లావణ్య గమనించలేదు. ఇంతలోనే రైలు ఆమె తలను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అంబులెన్స్కు సమాచారం అందించగా వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించే సరికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్ రావడంతో గుర్తింపు..
మృతురాలి వివరాలు మొదట తెలియపోవడంతో గుర్తుతెలియని మహిళ మృతిగా రైల్వే పోలీసులు భావించారు. సాయంత్రానికి ఆమె స్నేహితుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్ చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని నాంపల్లి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా ఇంద్రానగర్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. -
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక