logo

సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

కక్షతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ సుధీర్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ ఒక్సార్‌ జిల్లాకు చెందిన....

Published : 17 Aug 2022 02:35 IST

శామీర్‌పేట, న్యూస్‌టుడే: కక్షతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ సుధీర్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ ఒక్సార్‌ జిల్లాకు చెందిన శివదులార్‌ రామ్‌(55) మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చారు. మండలంలోని బొమ్మరాశిపేట పరిధిలోని శ్రీకృష్ణ కంకర మిషన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అందులోనే మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్‌మరవి వెయిట్‌ మిషన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మద్యం తాగే అలవాటు ఉంది. సక్రమంగా వెయిట్‌ మిషన్‌ గదిలో ఉండటం లేదని సూపర్‌వైజర్‌కు సెక్యూరిటీ గార్డు సమాచారమిస్తున్నట్లు అనుమానించి కక్ష పెంచుకున్నాడు. సెక్యూరిటీ గార్డుపై కక్ష పెంచుకున్న ఆపరేటర్‌.. శివదూలార్‌ రామ్‌ను సోమవారం రాత్రి తోసేశాడు. తలకు గాయమై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆపరేటర్‌ ఆగ్రహంతో సెక్యూరిటీ గార్డు తలపై రాయితో మోదాడు. సమీపంలోని చెట్ల మధ్య మృతదేహాన్ని పారేసి పారిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని