నిధియే.. ఆటలకు పెన్నిధి
క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
దృష్టి సారిస్తేనే ప్రయోజనం
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్, పరిగి: క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామాల్లో వివిధ ఆటలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువకులు ఎంతో మంది ఉన్నారు. సరియైన సౌకర్యాలు లేక సాధన చేయడంలేదు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో స్టేడియం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆయితే ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. ఇక ఇటీవల ఏర్పాటు చేసినా క్రీడాప్రాంగణాలు వల్ల కూడా ప్రయోజనం చేకూరడంలేదు.
పాఠశాల ఆవరణలోనే వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులు
నాలుగు ప్రాంతాల్లో స్థలాలు సిద్ధం
మైదానాల ఏర్పాటుకు వికారాబాద్ ఎన్నెపల్లి సమీపంలో 5.6, కొడంగల్ పట్టణంలో 5, కుల్కచర్లలో 7, యాలాల మండలం బెన్నూరులో 5 ఎకరాల భూములను 2015లో సేకరించారు. ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇవి మంజూరైతే ప్రతి స్టేడియంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆడేందుకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. అయినా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం ఈ వ్యయం రెండింతలయిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఖేలో ఇండియా పథకంలో..
ఖేలో ఇండియా పథకం కింద క్రీడా కేంద్రం మంజూరైంది. దీనిని రూ.7లక్షలతో పరిగిలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఖోఖో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణ, అభివృద్ధి, పోటీల నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు చొప్పున నాలుగేళ్ల పాటు మంజూరు కానున్నాయి.
అభివృద్ధికి నోచని నల్ల మైదానం
వికారాబాద్లో నల్ల మైదానాన్ని (బ్లాక్ గ్రౌండ్) ప్రత్యేకంగా అథ్లెటిక్స్ కోసం తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇది కూడా ప్రతిపాదనల వద్దనే మిగిలిపోయింది. పరిగిలో మాత్రం రూ.28 లక్షలతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. జిల్లాలోని నాలుగు క్రీడా మైదానాల నిర్మాణానికి ఉన్నతాధికారులకు లేఖలు రాస్తూనే ఉన్నామని స్థానిక అధికారులు తెలిపారు.
400 మీటర్ల ట్రాక్ ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రంలో ఆటలకు వసతులు లేవు. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల పోలీసు, ఆర్మీ, బీఎస్ఎఫ్ తదితర వాటిల్లో ఉద్యోగం సాధించే వీలుంటుంది.
ప్రతాప్రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు, శివారెడ్డిపేట
వసతుల కల్పనకు కృషి చేస్తాం
జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో మైదానాలను ఎంపిక చేశాం. నిధులు విడుదల చేయకపోవటంతో పనులు ప్రారంభించలేదు. ఈ విషయమై లేఖలు రాస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఖేల్ ఇండియా సంస్థను సంప్రదించాం. పరిగిలో ఖోఖో కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.
హన్మంత్రావు, జిల్లా యువజన అధికారి, వికారాబాద్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.