పైవంతెనపై ఏం జరుగుతోంది?
పైవంతెనలపై వేగ పరిమితి బోర్డులు మాయమవుతున్నాయి. హైటెక్సిటీలో వంతెనలన్నింటిపైనా ఇదే పరిస్థితి.
హైటెక్సిటీలో వేగ పరిమితి బోర్డులన్నీ మాయం
మాకేం తెలియదంటున్న జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు
ఖాజాగూడ - బయోడైవర్సిటీ వంతెనపై మాయమైన వేగపరిమితి సూచిక
ఈనాడు, హైదరాబాద్: పైవంతెనలపై వేగ పరిమితి బోర్డులు మాయమవుతున్నాయి. హైటెక్సిటీలో వంతెనలన్నింటిపైనా ఇదే పరిస్థితి. మలుపులు, వాలును పరిగణనలోకి తీసుకుని వాహనాలకు జీహెచ్ఎంసీ విధించిన గరిష్ఠ వేగ పరిమితి బోర్డులు కనిపించకుండాపోవడం ఆందోళన కలిగిస్తోంది. పైవంతెనలపై సర్వాధికారాలున్న జీహెచ్ఎంసీకి ఈ విషయమే తెలియదు. నగరంలో లక్ష సీసీకెమెరాలు ఏర్పాటుచేసి చీమ చిటుక్కుమన్నా తెలుస్తోందనే ట్రాఫిక్ పోలీసులూ మాకేం తెలుసంటున్నారు. ఈ తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గచ్చిబౌలి వంతెనపై సూచికకు నల్ల రంగు
ప్రమాదాల నివారణకు..
2019 నవంబరులో ఖాజాగూడ కూడలి నుంచి బయోడైవర్సిటీ రెండో స్థాయి పైవంతెనపైకి వేగంగా దూసుకెళ్లిన ఓ కారు కిందకు పల్టీ కొట్టింది. రోడ్డుపై ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దుర్ఘటనలు నగరంలోని వేర్వేరు పైవంతెనలు, రహదారులపై గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ప్రధానరోడ్లపై గంటకు 60కి.మీ, పైవంతెనలపై 40కి.మీ వేగాన్ని పరిమితిగా విధించింది. సూచికలు పెట్టింది. గచ్చిబౌలి ఓఆర్ఆర్నుంచి శిల్పాలేఅవుట్ మీదుగా ఐకియా వెనుకవైపు వరకు శిల్పాలేవుట్ పైవంతెనపై మలుపులు ఎక్కువ ఉండటంతో.. వేగాన్ని 30కి.మీ.కే పరిమితం చేసింది. ఇప్పుడు ఆయా బోర్డులేవీ కనిపించట్లేదు. బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపైనా బోర్డులు మాయమయ్యాయి. గచ్చిబౌలి పైవంతెన సూచికలు నల్లరంగు పులుముకున్నాయి. జీహెచ్ఎంసీని వివరణ కోరగా.. తమకు విషయం తెలియదని ఓ సీనియర్ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకుని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!